నిర్మాత దేవీ ప్రసాద్ దాదాపు 15 కోట్ల బడ్జెట్ తో మృగరాజు సినిమా ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. 15 కోట్లు అంటే ఆ రోజుల్లో భారీ బడ్జెట్ సినిమా అని చెప్పవచ్చు. మృగరాజు సినిమా దర్శకుడు గుణశేఖర్ ఇతను అప్పటికే చిరంజీవితో "చూడాలని ఉంది" అనే మూవీ తీసి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కారణంగానే నిర్మాత దేవి ప్రసాద్ మృగరాజు మూవీ కి అంతా బడ్జెట్ పెట్టడానికి కారణమని చెప్పుకుంటారు.
"మృగరాజు" మూవీ ‘ఘోస్ట్ అండ్ డార్క్ నెస్’ అనే ఇంగ్లీష్ మూవీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగు లో నిర్మించారు. ఈ సినిమాకి మొదట దర్శకునిగా జయంత్.సి.పరాన్జీ అనుకున్నారట. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు గుణశేఖర్ చేతికి వెళ్ళింది. ఈ చిత్రంలో కనిపించే జాక్ అనే సింహానికి 67 లక్షల ఖర్చు పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్ దాదాపుగా 60 లక్షల ఖర్చుతో నిర్మించారట.
ఇలా ఈ స్టార్ నిర్మాత, స్టార్ డైరెక్టర్ మెగాస్టార్ కాంబినేషన్లో వస్తున్న "మృగరాజు" మూవీ భారీ అంచనాలతో 2001లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీపై తెలుగు ఇండస్ట్రీలోనూ అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నప్పటికీ అనుకోని విధంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. చివరకు మృగరాజు మూవీ పెద్ద ప్లాప్ గా నిలిచి నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చింది.