పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా ఒకదాని వెంట మరొకటి సినిమాలు చేస్తూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముందుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని ఏప్రిల్ 9న గ్రాండ్ లెవెల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు సిద్ధమవుతోంది. అలానే దానితో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మాత గా తెరకెక్కుతున్న భారీ పీరియాడికల్ సినిమాతో పాటు యువ దర్శకుడు సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ రెండు సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు వీటి తర్వాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ ప్రతిష్టాత్మక సినిమాతో పాటు ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాగే వీటి తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న మూవీ కూడా పవన్ చేయనున్నట్లు సమాచారం. అలానే వీటన్నిటితో పాటు యువ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయనున్నారని కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి.

అయితే ఈ సినిమా విషయంలో లేటెస్ట్ గా కొన్న టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మూవీ ఆల్మోస్ట్ ఆగిపోయినట్లే అనే సమాచారం అందుతోంది. నిజానికి ఇటీవల పవన్ కోసం ఒక అద్భుతమైన స్టోరీ లైన్ రెడీ చేసిన సంతోష్ శ్రీనివాస్ ప్రస్తుతం ఆయన వరుసగా ఐదు సినిమాలు చేస్తుండటంతో అవి పూర్తయిన అనంతరమే పవన్ కు స్టొరీ వినిపించాలని భావిస్తున్నారట. అప్పటి వరకు దీన్ని పక్కన పెట్టి ఈ లోపు మరో సినిమా చేయాలని సంతొష్ నిర్ణయించినట్లు సమాచారం. దీనిని బట్టి ఆల్మోస్ట్ పవన్, సంతోష్ ల కలయికలో రానున్న సినిమా పక్కకు వెళ్లి పోయినట్లే అనేటువంటి ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై పూర్తి వాస్తవాలు వెల్లడి కావాలి అంటే మరి కొన్నాళ్ళ వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: