ప్రతిష్టాత్మకంగా రూపొందిన "బాహుబలి" చిత్రం శుక్రవారం విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక తెలుగు చలనచిత్ర మేటి దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో యువ క్రేజీ నటులు ప్రభాస్, రాణా, అనుష్క, తమన్నాల కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రాన్ని తొలిరోజే చూడాలని అభిమానులు ఉవిళ్ళూరుతున్నారు. కాగా శుక్రవారం ఈ చిత్రం విడుదల కానుండడంతో హైదరాబాద్ ప్రసాద్స్ థియేటర్ వద్ద టికెట్ల విక్రయాన్ని బుధవారం ఉదయం నుండి ప్రారంభించారు. దీనితో ఈ చిత్ర అభిమానులు ఆ థియేటర్ వద్ద కిలోమీటరు మేర పెద్దగా బారులు తీరారు. ఇక పురుషుల లైన్ ఐమాక్స్ నుండి ప్యారడైజ్ మీదుగా పాస్ పోర్ట్ వెరిఫికేషన్ సెల్ ను దాటిపోగా, మహిళల క్యూ ఇందిరా పార్కు వరకు ఉండడం విశేషం. ఇక తెలుగు రాష్ట్రాలలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఎన్ని రికార్డులను తిరగరాయనుందో వేచి చూడాల్సిందే.(source)

మరింత సమాచారం తెలుసుకోండి: