అడివి శేష్ కథల ఎంపిక ఎప్పుడు కొత్తగా మరియు విభిన్నంగా ఉంటుంది.క్షణం,
గూఢచారి వంటి సినిమాల్లో తనదైన నటనతో మంచి నటుడిగా కూడా పేరు తెచ్చుకున్న అడివి శేష్ ప్రస్తుతం ‘మేజర్’
సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న ఈ
సినిమా తెలుగు ,హిందీ లో ఒకేసారి విడుదల కాబోతుంది. ఇక ఈ మధ్యనే ఈ చిత్రం ఎలా పుట్టింది, ఫస్ట్ లుక్ ఎలా చేసాం అన్నది ఇటీవల ఓ వీడియో ద్వారా తెలియజేశారు అడవి శేష్. గూఢచారి ఫేం శశికిరణ టిక్కా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
హీరోయిన్ గా శోభితా దూళిపాళ్ల నటిస్తుంది. కాగా, 26/11
ముంబై దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ఎందరినో కాపాడిన ఎన్.ఎస్.జి కమెండో మేజర్ ఉన్నికృష్ణన్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈ
సినిమా సూపర్ హిట్ తో అడివి శేష్ కూడా పాన్
ఇండియా స్టార్ అవ్వాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే తెలుగులో వరస హిట్స్ తో అడివి శేష్ మంచి ఊపులో ఉన్నారు. అయితే ఆయన సినిమాలకి ఒక రేంజ్ లో కలెక్షన్స్ మాత్రం రావు. ఇలా
అయాన్ ఇండియా స్టార్ అయితే మాత్రం ఆయన చేసే వైవిధ్య భరితమైన సినిమాలకి కలెక్షన్స్ మాత్రం ఆగవు. ఇక ఆయన తర్వాత సినిమాలు కూడా భారీ పాన్
ఇండియా రేంజ్ లో విడుదలైయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. అయితే ఆయన తర్వాత
సినిమా మీద అడివి శేష్ రేపు తన కొత్త
సినిమా ని ప్రకటించబోతున్నారు. ఈ
సినిమా నాని నిర్మిస్తున్న హిట్ 2 అని టాక్ వినిపిస్తోంది . ఇందులో నిజం ఏంటి అని తెలియాలంటే రేపటి వరకు వేచి ఉండాలి. అయితే ఈ
సినిమా కూడా విభిన్నంగా ఉంటది అనటంలో సందేహం లేదు.