అడివి శేష్ కథల ఎంపిక ఎప్పుడు కొత్తగా మరియు విభిన్నంగా ఉంటుంది. క్ష‌ణం, గూఢచారి వంటి సినిమాల్లో త‌నదైన న‌ట‌న‌తో మంచి నటుడిగా కూడా పేరు తెచ్చుకున్న అడివి శేష్  ప్ర‌స్తుతం ‘మేజర్’ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే.  మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న ఈ సినిమా తెలుగు ,హిందీ లో ఒకేసారి విడుదల కాబోతుంది. ఇక ఈ మధ్యనే ఈ చిత్రం ఎలా పుట్టింది, ఫ‌స్ట్ లుక్ ఎలా చేసాం అన్న‌ది  ఇటీవ‌ల ఓ వీడియో ద్వారా తెలియ‌జేశారు అడ‌వి శేష్.  గూఢ‌చారి ఫేం శ‌శికిర‌ణ టిక్కా చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. హీరోయిన్ గా శోభితా దూళిపాళ్ల  న‌టిస్తుంది. కాగా, 26/11 ముంబై దాడుల్లో త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఎంద‌రినో కాపాడిన ఎన్‌.ఎస్‌.జి క‌మెండో మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ అన్న సంగ‌తి తెలిసిందే.

 ఇక ఈ సినిమా సూపర్ హిట్ తో అడివి శేష్ కూడా పాన్ ఇండియా స్టార్ అవ్వాలని అనుకుంటున్నాడు.మెల్లగా టాలీవుడ్ లో కూడా స్టార్ హీరో గా మారిపోతున్నాడు అడివి శేష్. అయితే ఆయన తర్వాత సినిమా నాని నిర్మిస్తున్న హిట్ 2 అని అందరికి తెలిసిన విషయమే. శైలేష్ కోలేను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇంతకుముందు విశ్వక్ సేన్ నటించిన హిట్ సినిమాకి సీక్వెల్ .అయితే ఈ హిట్ 2 లో పోలీస్ పాత్ర ఒక ఆంధ్రకి సంబంధించి ఉంటుందని అడివి శేష్ ని తీసుకున్నారు అని టాక్.అయితే అడివి శేష్ చేయడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు వచ్చాయి.

 ఇక ఈ సినిమా తర్వాత అడివి శేష్ గూఢచారి 2 సినిమాలో నటించబోతున్నాడు. ఇంతకుముందు వచ్చిన గూఢచారి సినిమా ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే. అయితే క్షణం సినిమా నుంచి ఇప్పటిదాకా ఒక్క ప్లాప్ కూడా లేకుండా అడివి శేష్ సినిమాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: