తెలుగు సీనియర్ హీరోయిన్ భూమిక ,సుమంత్ హీరోగా నటించిన కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'యువకుడు' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు, ఈ ముద్దుగుమ్మ నటనకు, అందచందాలకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులే పడడంతో భూమిక కు తెలుగులో వరుస ఆఫర్లు దక్కాయి. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ తో సింహాద్రి, మహేష్ బాబుతో ఒక్కడు, పవన్ కళ్యాణ్ ఖుషి,  చిరంజీవితో జై చిరంజీవ, వెంకటేష్ తో వాసు, నాగార్జునతో స్నేహమంటే ఇదేరా, ఇలా తెలుగులో దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం ఈ ముద్దుగుమ్మ  సినిమాల పరంగా కొంచెం స్లో అయిందని చెప్పవచ్చు.

కొంత కాలం గ్యాప్ తీసుకొని తెలుగు లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ ఎంసీఏ ,యూటర్న్ లాంటి సినిమాలతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇలా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ అంతే ఆక్టివ్ గా ఉంటుంది. అప్పట్లో సోషల్ మీడియా వేదికగా భూమిక సుశాంత్ రాజ్ పుత్ మరణం పై చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. 'ఎంఎస్ ధోని' సినిమాలో సుశాంత్ రాజ్ పుత్ కు భూమిక అక్క గా నటించే విషయం అందరికీ తెలిసిందే. అయితే భూమిక తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. అసలే ఇది కరుణ కాలం.. ఎవరు కూడా ఎక్కువగా బయటకు వెళ్లడం లేదు. ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ అంటూ మీటింగులు జరగడం లేదు. కానీ ఈమధ్య పరిస్థితులు కాస్త మారాయి. ఇదిలా ఉంటే తాజాగా భూమిక తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ ని కలిసి నట్టు ఉంది. ఈ మేరకు వారందరూ కలిసి సరదాగా ముచ్చటించుకుంటూ అలా డ్రింక్ చేసినట్టు కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: