టాలీవుడ్ లో రంగస్థలం సినిమా ఎంతటి హైప్ ను క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నటించిన పాత్రలు ప్రతి ఒక్కరిని బాగా అలరించాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఇందులో రామ్ చరణ్ చెవిటి పాత్రలో నటించి, మంచి మార్కులు కొట్టేశాడు. ఇక ఈ సినిమాని డైరెక్టర్ సుకుమార్ తన ప్లాన్ ప్రకారమే అద్భుతంగా తీసాడు అని చెప్పవచ్చు.

ఇక ఇందులో రామ్ చరణ్ నటన తో పాటు, జగపతిబాబు యాక్షన్ కూడా ఈ సినిమాకి మరొక ప్లస్ అని చెప్పవచ్చు. ఇక అనసూయ రంగమ్మత్త గా, ఆది పినిశెట్టి రామ్ చరణ్ అన్నగా, సమంత ఒక పల్లెటూరి అమ్మాయి గా, ఎంతో అద్భుతంగా నటించారని చెప్పవచ్చు. అయితే ఇదే సినిమాలో నటుడు పృథ్వీరాజ్ కూడా కొన్ని సీన్స్ చేశారట. కానీ వాటిని ఎడిటింగ్ లో డిలీట్ చేశారంటూ ఒక ఇంటర్వ్యూ ఛానల్ ద్వారా తెలియజేశాడు.


అయితే  ఆయన తెలిపిన ప్రకారం.. ఆయనే స్వయంగా ఆ సినిమాలోని కొన్ని పాత్రలను తనతో షూటింగ్ జరుపుకొని, అలా జరుపుకున్న తర్వాత డబ్బింగ్ కూడా పూర్తి చేసి, ఆ తరువాత ఆ సీన్లను తొలగించడం వలన చాలా బాధగా ఉండేదని చెప్పుకొచ్చాడు . అంతే కాకుండా ఆ పని ఎందుకు చేశారో కూడా ఆయనే స్వయంగా వివరించాడు.

డైరెక్టర్ సుకుమార్ పృథ్వీరాజ్ తో కలిసి పాత్రలన్నిటిని పూర్తిచేసిన తరువాత, సుకుమార్ కి తన స్నేహితుడు  యు ఎస్ ఏ నుంచి కాల్ చేసి పృథ్వీరాజు ఎందుకు సినిమాల్లో పెట్టుకున్నావు, ఆయన ఈ మూవీ లో ఉంటే.."రావు గోపాల్ రావు"అంతటి వాడు అవుతారని చెప్పడంతో.. ఆయన మన పృథ్వీరాజు నటించిన సీన్ లను తీసేసారు అన్నట్లుగా తెలియజేశాడు.

ఇక పృథ్వీరాజ్ ఈ మధ్య కాలంలో అవకాశాలు తగ్గాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా పూర్తిగా ఒక పని చేసిన తర్వాత, తిరిగి ఎడిటింగ్ లో తీసేస్తే  ఎంత బాధగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం ఉండదు.


మరింత సమాచారం తెలుసుకోండి: