ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ ఛార్మి ఇపుడు మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలసి నిర్మాతగా మారారు. సొంతం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ నమిత కూడా నిర్మాతగా మారి తనకంటూ సొంత ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించిన విషయం తెలిసిందే. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోయిన్ తాప్సీ పన్ను కూడా అవుట్ సైడర్ అనే నిర్మాణ సంస్థను నెలకొల్పింది. టాలీవుడ్ చిన్నారి పెళ్ళికూతురు అవికా గోర్ కూడా కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.
కానీ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఓన్ గా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలు నిర్మిస్తున్నారు. ఆ చిత్రాల్లో తానే హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తున్నారు. భూమిక కూడా ఒకానొక సమయం లో నిర్మాతగా మారారు కానీ ఫెయిల్యూర్ ను ఎదుర్కొన్నారు. ఇలా చాలా మంది హీరోయిన్లు సైతం మేకర్స్ గా మారుతూ వినూత్న చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇలా హీరోయిన్ లు నిర్మాతలుగా మారుతున్నారు. కానీ, సక్సెస్ రేట్ మాత్రం అంతగా లేదనే చెప్పాలి. ఇందుకు కారణం సినిమా అనేది ఒక వ్యాపారంగా మారిపోవడమే, అంతే కాకుండా సరైన కథలను ఎంచుకోవడంలో లోటు పాట్లు ఉండడమే అని తెలుస్తోంది.