సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న భారీ సినిమా సర్కారు వారి పాట. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా దీనిని వచ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుదల చేయనున్నారు. మరోవైపు బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ సినిమా అఖండ. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే నెల 2న రిలీజ్ కానుంది.

బాలయ్య డ్యూయల్ రోల్ చేసిన ఈ మూవీని బోయపాటి తీయగా ద్వారకా క్రియేషన్స్ సంస్థపై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించారు. అయితే సర్కారు వారి పాట తరువాత త్రివిక్రం, రాజమౌళి లతో మహేష్ తన నెక్స్ట్ సినిమాలు చేయనుండగా అఖండ అనంతరం గోపీచంద్ మలినేని తో తదుపరి సినిమా చేయనున్నారు బాలయ్య. ఇక విషయం ఏమిటంటే ఈ సినిమాల అనంతరం అటు మహేష్, ఇటు బాలయ్యల తో ఒక భారీ మల్టీస్టారర్ ని ప్లాన్ చేస్తున్నారట టాప్ డైరెక్టర్ కొరటాల శివ. ప్రస్తుతం మెగాస్టార్ తో ఆచార్య మూవీ చేస్తోన్న కొరటాల అది పూర్తి అయిన అనంతరం ఎన్టీఆర్ తో నెక్స్ట్ సినిమా తీయనున్నారు.

యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ సంస్థలు ఆ సినిమాని నిర్మించనున్నాయి. ఇక మరోవైపు ప్రస్తుతం మహేష్, బాలయ్యసినిమా స్టోరీ విషయమై కూడా భారీ కసరత్తు ప్రారంభించిన శివ, వీలైనంత త్వరలో దానిని పూర్తి చేసి ఇరువురు హీరోలకి వినిపించనున్నారని టాక్. భారీ యాక్షన్ తో కూడిన మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉందట. అయితే ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ న్యూస్ పై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: