స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప మేనియా ప్రస్తుతం టాలీవుడ్ సహా అన్ని భాషల్లో కొనసాగుతోంది. ఎవరిని చూసిన పుష్ప గురించే చాలావరకు చర్చిస్తున్నారు. గత ఏడాది త్రివిక్రమ్ తో పని చేసిన అలవైకుంఠపురములో మూవీ తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ తొలిసారిగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప. ఇప్పటికే ప్రీ రిలీజ్ పరంగా ఎంతో భారీగా బిజినెస్ చేసి అందరిలో అంచనాలు పెంచిన పుష్ప, తప్పకుండా హిట్ కొడుతుందని ఒకవైపు యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తుండగా మరోవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తప్పకుండా పుష్ప తో తమ హీరో పాన్ ఇండియా స్టార్ గా గొప్ప రికార్డు అందుకోవడం ఖాయం అని అంటున్నారు.

ఇక ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్, టీజర్లు, పోస్టర్స్ అన్ని కూడా అందరినీ అలరించడం, మరోవైపు చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత సుకుమార్ తో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇంత భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా మొదటి భాగం రేపు రిలీజ్ అవుతోంది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని నవీన్, రవిశంకర్ మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా పుష్ప ని నిర్మించారు. విషయం ఏంటంటే ప్రస్తుతం అటు టాలీవుడ్ వర్గాల్లో కూడా పూర్తి పాజిటివ్ బజ్ ని నింపిన పుష్పకి మంచి టాక్ వస్తే కలెక్షన్స్ అదరగొట్టి రికార్డ్స్ కొల్లగొట్టడం ఖాయం అంటున్నారు.

అయితే ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్ ని బట్టి చూస్తే గతంలో రామ్ చరణ్ తో సుకుమార్ తీసిన రంగస్థలం ఛాయలు కనపడుతున్నాయని, టాక్ తేడా వస్తే ఇక అంతే సంగతులు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. కాగా అటువంటివన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ప్రతి సినిమాకి నెగటివిటీ చేసే వారు కొందరు ఉంటారని, తామందరం ఎంతో కష్టపడి తీసిన పుష్ప పార్ట్ 1 మూవీ ని మంచి అంచనాలతో థియేటర్స్ కి వచ్చి బాగా ఎంజాయ్ చేయండి, తమ అంచనాలు మూవీ అందుకుంటుందని అంటోంది యూనిట్. మరోవైపు అన్ని చోట్ల పుష్ప అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతుండడంతో అందరిలోనూ ఈ మూవీ చూడాలనే ఆసక్తి మరింతగా పెరుగుతోంది. మరి పుష్ప ఎంత మేర విజయం అందుకుంటుందో పక్కాగా తెలియాలి అంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: