సాధారణ ప్రజలే కాదు.. పలువురు సినీ ప్రముఖులు సైతం తాగుడుకు బానిసైన వారున్నారు. తమ అద్భుత నటనతో జనాల మనుసుల్లో చెరగని ముద్ర వేసుకున్న పలువురు నటీమణులు కూడా తాగుడుకు బానిసలుగా మారడం ఆశ్చర్యం కలిగించక మానదు. జీవితంలో పలు సమస్యల మూలంగా విపరీతంగా మద్యం సేవించి జీవితాలను సర్వనాశనం చేసుకున్నారు. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో తాగుడుకు బానిసై పతనమైన నటీమణులు ఎవ్వరో ఇప్పుడు చూద్దాం..
సావిత్రి
మహానటి సావిత్రి సైతం తాగుడుకు బానిసైనది. తన జీవితాన్ని కోల్పోయింది. కెరీర్ చివరిలో మద్యం విపరీతంగా తీసుకోవడం మూలంగా ఎన్నో అవస్థలు పడ్డది. సావిత్రి తాగుడుకు బానిస కావడం వెనుక జెమినీ గణేషన్ మోసాలే కారణమంటారు చాలా మంది. ఇక ప్రస్తుతం ఉన్న ముదురు భామలు సైతం పలువురికి విపరీతమైన తాగుడు అలవాటు ఉందనే టాక్ వినిపిస్తోంది. వారందరూ పార్టీలు, పబ్బుల పేరుతో ఒంటిసోయి లేకుండా తాగుడుకు బానిసలవుతున్నారనే మాటలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఊర్వశి
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన హీరోయిన్ ఊర్వశి. ఈమె తన సహ నటుడు మనోజ్ను పెళ్లాడింది. అనంతరం తన వ్యక్తిగత జీవిత సమస్యలతో తాగుడుకు బానిసైంది. వీరికి ఒక పాప పుట్టాక భర్త విడాకులు తీసుకున్నాడు. ఆ తరువాత ఆమె చాలా దుర్భర జీవితాన్ని గడిపింది.
సారిక
కమల్ హాసన్ రెండవ భార్య సారిక కూడా తాగుడుకు బానిస అయింది. ఆమె పెళ్లికి ముందే గర్భవతి కూడా. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత తాగుడు మరింత పెంచింది. దీంతో కమల్ ఆమెకు చేసేది ఏమి లేక విడాకులు ఇచ్చారు. కేవలం వీరే కాకుండా ఈ మధ్య కాలంలో డ్రగ్స్ కేసులో ఉన్న పలువురు నటీమనులున్నారు. పోలీసులకు పబ్బుల్లో చిక్కిన బామలు కూడా ఉండడం విశేషం.