మెగాస్టార్ చిరంజీవి కెరియర్ మంచి  పిక్స్ లో ఉన్న సమయం లోనే రాజకీయాల వైపు దృష్టి మళ్లించి కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరమయ్యారు, ఆ తరువాత మళ్లీ సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో చిరంజీవి, వి వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమా తరువాత చిరంజీవి, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయింది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాల్లో నటిస్తున్నాడు.  అయితే ఈ సినిమాలలో కొన్ని ముఖ్య పాత్రల కోసం చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి పేరు ఉన్న హీరోలపై పోకలు పెట్టాడు.  

ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే ఈ చెల్లెలు పాత్రకు భర్తగా నటించడానికి టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ను చిత్ర బృందం సంప్రదించినట్లు తెలుస్తోంది, అయితే నాగ శౌర్య ఈ సినిమాకు ఓకే చెప్పింది లేనిది మాత్రం ఇంకా తెలియదు. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ ను చిత్ర బృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి, బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమాలో నటించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ హీరో అయిన  రవితేజను చిత్ర బృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇలా చిరంజీవి టాలీవుడ్ లో మంచి స్థాయిలో ఉన్న హీరోలను తన సినిమాల్లో నటింపచేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: