మాస్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. దర్శకుడిగానే కాదు ప్రస్తుతం నిర్మాతగా కూడా మారి హీరోయిన్ చార్మితో కలిసి సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక దర్శకుడిగా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన పూరీ జగన్నాథ్ ఈ మధ్యకాలంలో వరుస ఫ్లాప్ లతో రేస్ లో వెనకబడ్డారు. ఆ తర్వాత మళ్లీ ఇస్మార్ట్ శంకర్ చిత్రం సక్సెస్ తో ఫామ్ లోకి వచ్చారు. ఇపుడు విజయ దేవరకొండతో లైగర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది కి విడుదల కానుంది. ఇక ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో అవకాశం దొరకడం అంటే అంత ఆషామాషి విషయమేమీ కాదు.

ఈ దర్శకుడి చిత్రంలో నటించేందుకు స్టార్ నటీనటులు సైతం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అలాంటి కంటెంట్ ఉన్న పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన రెండు చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది ఇలియాన. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస చిత్రాలతో బిజీ హీరోయిన్ గా చక్రం తిప్పిన ఈ అందాల తారలు ఈ మధ్య అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అయితే అప్పట్లో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో  వచ్చిన పోకిరి, నేను నా రాక్షసి, దేవుడి చేసిన మనుషులు మొత్తం మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అయితే ఇందులో పోకిరి చిత్రం సూపర్ డూపర్ హిట్ కాగా....నేను రాక్షసి, దేవుడు చేసిన మనుషులు ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి.

కానీ ఈ సినిమాలతో ఇలియానా కి మాత్రం మంచి మార్కులే లభించాయి.  స్టార్ హీరోయిన్ కాజల్ కూడా ఈ దర్శకుడితో కలిసి రెండు చిత్రాలు చేసింది. బిజినెస్ మ్యాన్ మరియు టెంపర్ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీసు వద్ద వసూలు వర్షం కురిపించి సరికొత్త రికార్డులు సృష్టించాయి. అయితే కాజల్ కన్నా ఇలియానాకు కొంచెం బాడ్ టైం నడిచింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: