టాలీవుడ్ కి తొలిసారిగా నేను శైలజ మూవీ ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన కీర్తి సురేష్ ఆ సినిమాతో మంచి విజయం సొంతం చేసుకున్నారు. రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాని కిషోర్ తిరుమల తీశారు. ఆ తరువాత నానితో నేను లోకల్ వంటి మరొక సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న కీర్త్ సురేష్ అనంతరం పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి చేసారు. అయితే ఆ మూవీ మాత్రం ప్లాప్ అయింది.
అనంతరం ఒకప్పటి గొప్ప నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి మూవీలో సావిత్రి పాత్రలో నటించి తన అద్భుత నటనతో ఏకంగా జాతీయ అవార్డు అందుకున్నారు కీర్తి సురేష్. ఇక ఇటీవల రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన పెద్దన లో ఆయన చెల్లెలి పాత్రలో నటించిన కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాట అలానే మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలు చేస్తున్నారు. ఇక వీటితో పాటు యువ దర్శకుడు నగేష్ కుకునూర్ తీస్తున్న గుడ్ లుక్ సఖి మూవీ కూడా చేస్తున్నారు కీర్తి. ఈనెల 28న రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్ ఇటీవల రిలీజ్ అయి అందరి నుండి మంచి స్పందన రాబట్టాయి.

అయితే విషయం ఏమిటంటే, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు సాయంత్రం హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఎంతో గ్రాండ్ గా నిర్వహిచేలా ఏర్పాట్లు చేసిన యూనిట్, ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక గెస్ట్ గా ఆహ్వానించినట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ప్రస్తుతం భోళా శంకర్ లో తన చెల్లెలిగా కీర్తి నటిస్తుండడంతో చిరంజీవిమూవీ ఫంక్షన్ కి విచ్చేయనున్నారని అంటున్నారు. ఒకవేళ మెగాస్టార్ ఈ ఫంక్షన్ కి వస్తే అది మూవీకి మరింత ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు. మరి మరొక రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీతో కీర్తి ఎంత మేర సక్సెస్ అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: