టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ ఈ మధ్య తన సినిమాల విషయంలో స్పీడు పెంచాడు. ఇటీవల సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన సిటిమార్ సినిమాతో ప్రేక్షకుల చేత సిటిమార్ అనిపించాడు ఈ మ్యాచో హీరో. ఇక ప్రస్తుతం తన తదుపరి సినిమాలకు సిద్ధమవుతున్నాడు గోపీచంద్.ఈ నేపధ్యంలోనే దర్శకుడు శ్రీవాస్ తో ముచ్చటగా మూడోసారి సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు.' గోపీచంద్ 30' అనే టైటిల్ తో పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ను గత ఏడాది డిసెంబర్లో అనౌన్స్ చేశారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న చిత్ర యూనిట్.. ఇప్పుడు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించినట్లుగా సమాచారం.

ఇక ఈ సినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఓ సీనియర్ హీరోయిన్ కూడా ఈ సినిమాలో భాగం కానుందని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటిస్తూ సరి కొత్త అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు చిత్ర యూనిట్ తెలియజేస్తూ.మ్ ఈ సినిమా షూటింగు ఈ రోజు హైదరాబాదులోని ప్రారంభమైంది. ఇక ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. ఇందులో సీనియర్ నటి ఖుష్బూ కూడా ఓ కీలక పాత్రను పోషిస్తోంది. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటిస్తూ కొత్త పోస్టర్ కూడా విడుదల చేసింది. ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు కమర్షియల్ అంశాలతో కూడిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.

సీనియర్ నటుడు జగపతి బాబు కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తుండగా.. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాని విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మరోవైపు ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో 'పక్కా కమర్షియల్' అనే సినిమాలో నటిస్తున్నాడు గోపీచంద్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకోగా.. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: