ప్రస్తుతం ప్రభాస్ కు పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ వున్న విషయం అందరికీ తెలిసిందే,  బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం కూడా వరుస పెట్టి పాన్ ఇండియా, అంతకు మించిన సినిమాలలో నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే,  అయితే అందులో భాగంగా ప్రస్తుతం ప్రభాస్,  రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాదే శ్యామ్ సినిమాలో హీరోగా నటించాడు,  ఈ సినిమా మార్చి 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతుంది,  సినిమా విడుదల తేది దగ్గర పడడంతో రాధే శ్యామ్ చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ ల స్పీడ్ ను పెంచింది,  కొన్ని రోజుల క్రితం ఈ సినిమాను  జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు,  కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదలను చిత్ర బృందం వాయిదా వేసింది,  ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో రాదే శ్యామ్ చిత్ర బృందం సభ్యులు పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సినిమా గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియ చేస్తున్నారు.

అందులో భాగంగా రాధే శ్యామ్ సినిమాలో నటించిన రిద్దీ కుమార్‌  తాజాగా విలేకరులతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది, రిద్దీ కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ... నేను తెలుగు లో ‘లవర్స్, అనగనగా ఓ ప్రేమకథ’ చిత్రంలో నటించాను, ఇంత తక్కువ సమయం లో ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఈ మూవీ లో నటనకు అవకాశం ఉన్న పాత్ర చేశాను, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా అని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.  ఇది ఇలా ఉంటే తెలుగు లో ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్‌ దేవరకొండ... ఇలా అందరి హీరోలతో నటించాలని ఉంది అని తాజా విలేకరుల సమావేశంలో రిద్దీ కుమార్‌ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: