విజయ్ దేవరకొండ ప్లాన్ మాములుగా లేదుగా..!!


టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ వరుసగా పాన్ ఇండియా సినిమాలు ను ప్లాన్ చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. ఇప్పటికే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. పూరి జగన్నాథ్ తో పాటు విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాతో పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు కాబట్టి ఈ చిత్రం తప్పకుండా బాగా చేసి ఉంటారని అభిమానులు భావిస్తున్నారు.


సాధారణ హీరోగా తన కెరీర్ను ప్రారంభించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఇంతటి స్థాయికి ఎదగడం ఆయన అభిమానులను నిజంగా గర్వపడేలా చేస్తుంది. ఇక ఈ చిత్రం తర్వాత కూడా ఇదే దర్శకుడితో కలిసి విజయ్ దేవరకొండ జనగణమన అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రేక్షకులను మరొక లెవెల్లో అలరించబోతోంది అని అంటున్నారు. పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఎప్పటి నుంచో చెబుతున్న ఈ సినిమా పట్టాలు ఎక్కడానికి చాలా సమయం తీసుకుంది అని చెప్పాలి. మహేష్ బాబు తో ఈ సినిమా చేయాలని భావించిన పూరి జగన్నాథ్ చివరకు విజయ్ దేవరకొండ తో ఈ సినిమాను చేస్తూ ఉండటం విశేషం.


ఇకపోతే పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుకుమార్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసే విధంగా విజయ్ దేవరకొండ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నాడు. పుష్ప రెండవ భాగాన్ని పూర్తి చేసిన తర్వాత వీరిద్దరూ షూటింగ్ చేయబోతున్నారు. అంతే కాదు శివ నిర్వాణ తో కలిసి ఈ హీరో ఓ ప్రేమకథా చిత్రాన్ని చేయబోతున్నాడు. గీత గోవిందం లాంటి మంచి కాన్సెప్ట్ ఈ సినిమాలో ఉండబోతుంది అని అంటున్నారు. ఇందులో సమంతాల కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత కూడా త్రివిక్రమ్ మరియు కొరటాల శివ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: