స్టార్ హీరో అయిన ప్రభాస్ గత సినిమా సాహో ఫ్లాప్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడంలో ఫెయిలైన విషయం తెలిసిందే.సాహో సినిమా నిర్మాతలకు అటూఇటుగా 50 కోట్ల రూపాయల వరకు నష్టాలను మిగిల్చిందని కామెంట్లు కూడా వ్యక్తమయ్యాయి. తాజాగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా థియేటర్లలో విడుదలైంది. రాధేశ్యామ్ నిర్మాతలు ఈ సినిమా కోసం 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట.. రాధేశ్యామ్ శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవగా థియేట్రికల్ కలెక్షన్ల ద్వారా ఈ సినిమా 200 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవాల్సి ఉందని తెలుస్తుంది.

 

ప్రభాస్ పై కొండంత భారం ఉండగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే పలు తెలుగు సినిమాలు క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేయాల్సిన బాధ్యత ప్రభాస్ పై ఉంది. మరి రాధేశ్యామ్ తో ప్రభాస్ లక్ష్యాన్ని చేధిస్తారో లేదో చూడాల్సి ఉంది. రాధేశ్యామ్ నిడివి 2 గంటల 18 నిమిషాలే అయినప్పటికీ ఈ సినిమా స్లోగా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 

లవ్ స్టోరీ అంటే స్లోగానే ఉంటుందంటూ నెగిటివ్ కామెంట్లకు ప్రభాస్ అభిమానులు ధీటుగా బదులిస్తున్నారట.. ఇప్పుడు రాధేశ్యామ్ గురించి నెగిటివ్ కామెంట్లు చేసిన వాళ్లే భవిష్యత్తులో ఈ సినిమా గురించి క్లాసిక్ అని చెబుతారని ఫ్యాన్స్ తెగ కామెంట్లు చేస్తున్నారు. రాధేశ్యామ్ సినిమా కలెక్షన్లు ఫుల్ రన్ లో ఏ విధంగా ఉంటాయో చూడాలి మరి.అయితే సినిమా టాక్ ఎలా ఉన్నా ప్రభాస్, పూజా హెగ్డే జోడీకి మాత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది.

 

ప్రభాస్ మరియు పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనేలా ఉందని నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. రాధేశ్యామ్ సక్సెస్ సాధించినా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: