RRR సినిమాతో యస్ యస్ రాజమౌళి తన ప్రతిభను మరోసారి ప్రపంచానికి చూపించాడు.. ఈయన సినిమాలంటే ఇక ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈయన తన ప్రతి సినిమాను కూడా ఏళ్ల పాటు చెక్కుతాడు కాబట్టి ఈయనకు అమర శిల్పి జక్కన్నతో పోలుస్తూ జక్కన్న అనే పేరు పెట్టారు.. ఇక ఇప్పటి దాకా రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రాజమౌళి సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. కాని వీరిద్దరికీ వున్న కొన్ని కమిట్మెంట్స్ వల్ల సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. దీంతో ఆయన అభిమానులతో పాటు యావత్ టాలీవుడ్ ఇండస్ట్రీ సినీ ప్రేక్షకులు అంతా కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు తెరమీదకు వస్తుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.



ఇక ఈ కాంబోలో రాబోతున్న సినిమాను ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసేలా సెన్సేషనల్ గా ప్లాన్ చేసారు. ఈ సినిమా ప్రారంభం అవ్వడానికి ఇంకా సమయం ఉండడంతో ఈ గ్యాప్ లో ఈ భారీ సినిమా బడ్జెట్ కి సంబంధించిన ఒక క్రేజీ బజ్ ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా ఆసక్తిగా మారింది.. ఇక ఈ సినిమాకు ఏకంగా 800 కోట్ల భారీ బడ్జెట్ పెడుతున్నారని ఒక షాకింగ్ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది.. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే ఈ సినిమాకి ఫైనల్ బడ్జెట్ గా 500 కోట్లు పెడుతున్నట్టు సమాచారం తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం వుందో తెలియదు కానీ ఈ సినిమా బడ్జెట్ వార్త అయితే నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: