ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్న మూవీ ఆచార్య . తండ్రి చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ ఇరువురు కలిసి ఫుల్ లెన్త్ మూవీ చేయడం ఇదే మొదటి సారి కావడం కూడా ఈ సినిమా అంచనాలు భారీ స్థాయికి చేరుకోవడానికి ఒక కారణం. ఇక తాజాగా ఈ సినిమా గురించి ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని పేర్కొనడం సంచలనంగా మారింది. తాజాగా ఈ మూవీ టీమ్ దర్శకుడు హరీష్ శంకర్ తో చిట్ చాట్ లో కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. చిరు, చెర్రీ ఇద్దరూ కలిసి ఒక షాట్ షూట్ చేశారట. అయితే ఆ టైం లో ఆ సీన్ ఎలా ఉంది ? పర్ఫార్మెన్స్ వంటి విషయాల గురించి ఎవరు మాట్లాడలేదు అట. ఈ షాట్ బాగా వచ్చిందా లేక మరో టేక్ చేయాలా అన్న అంశంపై సతమతమయ్యారట. టైం పరుగులు తీస్తోంది... లంచ్ బ్రేక్ అని చెప్పినా ఎవరూ ఇంచు కూడా కదలలేదు.

అంతగా ఆ సన్నివేశంలో తండ్రి తనయులు పర్ఫార్మెన్స్ కి మంత్ర ముగ్ధులు అయిపోయారు అంతా... మేమే టైం తీసుకుని ఎవరూ కదలట్లేదండీ ఆ సీన్ చూసి అంటూ దర్శకుడు కొరటాల గారితో చెప్పాము. ఆ తర్వాత  అప్పుడు ఆ సీన్ ను స్క్రీన్ పైన చూసి అందరి కళ్ళలో నీరు తిరగాయి.. కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళారు. అంతలా ఆ సీన్ అందరినీ కట్టి పడేసింది. చిరు చెర్రీ ఇద్దరూ కూడా వారి సహజ నటనతో అందరినీ ఫిదా చేశారు ..ఇంత నటించినప్పటీకి నిజమేనేమో అనిపించేలా నటించారు. ముఖ్యంగా చెర్రీ ఆ సీన్ లో గుండెల్ని పిండేసేలా నటించి గూస్ బంప్స్ చెప్పించారు అంటూ చెప్పుకొచ్చారు.

కాగా ఈ సినిమా మరో 24 గంటల్లో థియేటర్ లలో ప్రత్యక్షం కాబోతోంది. మరి కొరటాల శివ మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందా ? లేదా ఈ సినిమాతో కొరటాల విజయాలకు బ్రేక్ పడుతుందా అన్న విషయాలు తెలియాలంటే ర్నేడు రోజుల వరకు ఆగాల్సిందే అంటున్నారు సినిమా వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: