అంతగా ఆ సన్నివేశంలో తండ్రి తనయులు పర్ఫార్మెన్స్ కి మంత్ర ముగ్ధులు అయిపోయారు అంతా... మేమే టైం తీసుకుని ఎవరూ కదలట్లేదండీ ఆ సీన్ చూసి అంటూ దర్శకుడు కొరటాల గారితో చెప్పాము. ఆ తర్వాత అప్పుడు ఆ సీన్ ను స్క్రీన్ పైన చూసి అందరి కళ్ళలో నీరు తిరగాయి.. కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళారు. అంతలా ఆ సీన్ అందరినీ కట్టి పడేసింది. చిరు చెర్రీ ఇద్దరూ కూడా వారి సహజ నటనతో అందరినీ ఫిదా చేశారు ..ఇంత నటించినప్పటీకి నిజమేనేమో అనిపించేలా నటించారు. ముఖ్యంగా చెర్రీ ఆ సీన్ లో గుండెల్ని పిండేసేలా నటించి గూస్ బంప్స్ చెప్పించారు అంటూ చెప్పుకొచ్చారు.
కాగా ఈ సినిమా మరో 24 గంటల్లో థియేటర్ లలో ప్రత్యక్షం కాబోతోంది. మరి కొరటాల శివ మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందా ? లేదా ఈ సినిమాతో కొరటాల విజయాలకు బ్రేక్ పడుతుందా అన్న విషయాలు తెలియాలంటే ర్నేడు రోజుల వరకు ఆగాల్సిందే అంటున్నారు సినిమా వర్గాలు.