స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీసిన లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప ది రైజ్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా ఇతర పాత్రల్లో సునీల్, అనసూయ, ఫహాద్ ఫాసిల్, శత్రు తదితరులు నటించారు. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచినప్ పుష్ప, రిలీజ్ తరువాత మంచి సక్సెస్ కొట్టి హీరోగా అల్లు అర్జున్ కి మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో సుకుమార్ ఆకట్టుకునే దర్శకత్వ ప్రతిభతో పాటు పుష్ప పాత్రలో మాస్ స్టైల్ లో అదరగొట్టిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరి మనసు దోచారు.

ఇక దీనికి సీక్వెల్ గా త్వరలో పుష్ప ది రూల్ తెరకెక్కనున్న విషయం తెల్సిందే. అయితే విషయం ఏమిటంటే, వాస్తవానికి ఈ సినిమా ఈపాటికే ప్రారంభం కావాల్సి ఉంది. కాగా కొన్ని కారణాల వలన కొంత వాయిదా పడ్డ పుష్ప ది రూల్ త్వరలో పట్టాలెక్కనున్నట్లు సమాచారం. మొదటి భాగాన్ని మించేలా మరింత అద్భుతంగా స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్న సుకుమార్, ఈసారి మరింత భారీ సక్సెస్ కొట్టేలా సినిమాని తెరకెక్కించేందుకు సన్నద్ధం అవుతున్నారట. ఇక రెండవ పార్ట్ లో అనసూయ పాత్ర తో పాటు ఫహాద్ ఫాసిల్ పాత్ర కూడా బాగా ఆకట్టుకుంటాయని అంటున్నారు.

అయితే త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా పూర్తవడానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు టైం పడుతుందని సమాచారం. ఒకవేళ ఈ పాటికే సినిమా మొదలై ఉంటె ముందుగా యూనిట్ భావించిన మాదిరిగా ఈ ఏడాది డిసెంబర్ లోనే పుష్ప రిలీజ్ అయ్యేదని, దీనిని బట్టి వచ్చే ఏడాదిలోనే పుష్ప రాజ్ పార్ట్ 2 ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు. కాగా ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: