డైరెక్టర్ రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ద్విపాత్రాభినయంలో నటించారు. ఈ చిత్రంలో శ్రీకృష్ణుడుగా పుండరీక రంగం ఆధునిక బాలయ్య అద్భుతమైన నటనను కనబరిచారు. ఇక నాగార్జునతో శ్రీరామదాసు సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ రాఘవేంద్రరావు బాలకృష్ణతో కూడా ఇలాంటి పారాణిగ చిత్రాన్ని తెరకెక్కించారు. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమాలో భక్తి కంటే రక్తి ఎక్కువగా ఉందని కామెంట్లు కూడా వినిపించాయి . ఇక ఇందులో స్నేహ టబు, అర్చన, మేఘనా నాయుడు వంటి వారు నటించారు. ఈ సినిమాలో గ్లామర్ కొరత ఏమీ ఉండదని చెప్పవచ్చు. కానీ సగటు ప్రేక్షకుడిని అలరించే అంశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. అందుచేతనే ఈ సినిమా ఫ్లాప్ అయిందని చెప్పవచ్చు.
ఈ చిత్రంలో హీరోగా ముందుగా రవితేజ నటించాల్సి ఉండగా.. కే రాఘవేందర్ రావు ముందుగా ఈ చిత్రాన్ని కథని రవితేజ కె వినిపించాడట. కానీ రవితేజ నా మొహానికి పాండురంగడు సినిమా సెట్ అవ్వదని.. అని తిరస్కరించారని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. రవితేజ డిసిషన్ కరెక్టే.. దీంతో ఈ సినిమా ఫ్లాప్ నుండి బయటపడ్డాడు రవితేజ. ఈ సినిమాకి కీరవాణి అందించిన సంగీతం అందరినీ అలరించాయి. ఈ చిత్రం మే 20న 2008వ సంవత్సరంలో విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. దీంతో ఇక అప్పట్నుంచి బాలకృష్ణ ఇలాంటి చిత్రాలపై ఎక్కువ మక్కువ చూపు లేదు.