టాలీవుడ్ సినిమా పరిశ్రమలో పాన్ ఇండియా సినిమాల జోరు రోజురోజు కి ఎక్కువైపోతోంది. చిన్న హీరోలు సైతం ఈ విధమైన సినిమాలు చేసి దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకోవాలని చూసేవారు. అయితే పెద్ద హీరోలే ఎంతో తడబడుతున్న ఈ సమయంలో చిన్న హీరోలు పాన్ ఇండియా హీరోలుగా ఎలా నిలబడగలుగుతారు అనేదే అసలు ప్రశ్న. అలా ఇప్పుడు ఓ మీడియం హీరో పాన్ ఇండియా సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఎంతో ఆకట్టుకున్నాడు. ఆయన ఎవరో కాదు అడివిశేష్.

క్షణం సినిమా తో కమర్షియల్ సక్సెస్ కొట్టి అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ హీరో ఇప్పుడు మేజర్ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకుని ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు పాన్ ఇండియా సినిమా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దేశం మొత్తం ను మెప్పించింది. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా కావడం, వీర జవాన్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ సినిమా కావడం ఈ చిత్రానికి ఇంతటి సక్సెస్ రావడానికి ముఖ్య కారణాలు. ఆ పాత్ర లో అడివి శేష్ పూర్తిగా ఒదిగిపోయాడని చెప్పాలి.

ఆ పాత్ర లో అంత బాగా నటించాడు కాబట్టే ఈ హీరో కి కూడా మంచి మార్కులు పడుతున్నాయి. ఏదేమైనా వారు పయత్నించిన తొలి పాన్ ఇండియా ప్రయత్నం భారీ సక్సెస్ ను సాధించింది. హీరోగా కూడా అడివి శేష్ బాగా ఎలివేట్ అయ్యాడు. ఆ విధంగా ఇప్పుడు ఆయన చేయబోయే తదుపరి సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటిదాకా చిన్న చిన్న విజయాలతో సరిపెట్టుకున్న అడివి శేష్ ఇప్పుడు భారీ సినిమా తో ప్రేక్షకులను అలరించి స్టార్ స్టేటస్ ను తెచ్చుకున్నాడు. పాన్ ఇండియా వైడ్ గా ఆయన సినిమా ను ఆకట్టుకోవడం అంటే మాములు విషయం కాదు. మరి భవిష్తత్ లో ఈ పాన్ ఇండియా స్టార్ ఏ స్థాయి లో ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: