తాజాగా యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్  ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా  కార్తీకేయ 2. అయితే గతంలో వచ్చిన కార్తికేయ చిత్రానికి సిక్వెల్ గా ఈ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ చందు మొండేటి.ఇకపోతే అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోన్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.ఇక  ఈ సినిమాను ద్వారకా నగరంపై జరిగే అన్వేషణ నేపథ్యంలో తెరకెక్కించారు. కాగా ఈ సినిమాను జూలై 22న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. పోతే ప్రమోషన్స్‌ కూడా మొదలు పెట్టేశారు. అయితే ఇక  ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలావుండగా తాజాగా కార్తికేయ 2 సినిమా విడుదల పై క్లారిటీ ఇచ్చాడు హీరో నిఖిల్. కార్తీకేయ 2 సినిమా టికెట్స్ 25 నిమిషాలలో సేల్ అయ్యాయని..ఇక  టికెట్స్ ఓపెన్ అయ్యాయంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. నిఖిల్ స్పందించాడు.అంతేకాదు  సారీ.. సినిమా జూలై 22న విడుదల కావడం లేదు.ఇకపోతే  ఆగస్ట్ మొదటివారంలో ప్రీమియర్ షో కోసం టికెట్స్ బుక్ చేసిన వారికి అమేజింగ్ పీపీఎల్ కి క్షమాపణలు చెబుతున్నాను..కాగా  మీ అమౌంట్ రిఫండ్ వస్తుంది అంటూ రిప్లై ఇచ్చాడు నిఖిల్.అయతే  మొత్తానికి కార్తికేయ 2 విడుదల వాయిదా పడిందంటూ హీరో క్లారిటీ ఇచ్చేశాడు.

ఇకపోతే ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు.అయితే  ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్‌, ఆదిత్యా మీనన్‌, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్‌ కీలకపాత్రలలో నటిస్తుండగా..ఇక  కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్నారు.అయితే చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక మంచి సినిమా తో హీరో నిఖిల్ సిద్ధార్థ్ రావడం ఆయన అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇక ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: