కోలీవుడ్ దర్శకులలో భారీ స్థాయిలో పేరు ప్రఖ్యాతలను కలిగి ఉన్నాడు దర్శకుడు మురుగదాస్. ఆయన దర్శకత్వంలో రూపొందిన ప్రతి ఒక్క
సినిమా కూడా ప్రేక్షకులను ఎంతో ఆలోచింపచేసేలా ఉంటుంది. అందుకే తక్కువ కాలంలోనే ఆయన సూపర్ హిట్ సినిమాలను చేసి ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ఆయన రజనీకాంత్ హీరోగా నటించిన
దర్బార్ సినిమా తర్వాత ఏ
సినిమా చేస్తాడు అన్న ఆసక్తి ఇంకా ఎవరికీ తెలియడం లేదు.
ఇంత పెద్ద దర్శకుడు ఒక
సినిమా తర్వాత తదుపరి
సినిమా చేయడానికి ఇంత సమయాన్ని తీసుకోవడం నిజంగా అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచే విషయం అని చెప్పవచ్చు.కేవలం తమిళనాడు మాత్రమే కాదు తెలుగు హిందీ భాషలలో సైతం ఈ దర్శకుడికి మంచి ఫాలోయింగ్ ఉంది.
గజిని సినిమా ద్వారా తెలుగు
సినిమా పరిశ్రమకు పరిచయమయ్యి ప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్న మురగదాస్ అదే చిత్రాన్ని హిందీలో
రీమేక్ చేసి ఘన విజయం సాధించి అక్కడి ప్రేక్షకుల ఆదరాభిమానాలను చురగున్నాడు.
తాజాగా ఆయన
హీరో శింబు తో ఓ
సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. వాస్తవానికి రజనీకాంత్ ధర్బార్
సినిమా తర్వాత
విజయ్ దళపతి తో ఆయన
సినిమా చేయవలసి ఉంది కానీ
విజయ్ దళపతి డేట్స్ దొరకకపోవడంతో అదే కథను శింబు ఇమేజ్ కు తగ్గట్లుగా మార్పులు చేసి ఆ సినిమాను రూపొందించబోతున్నాడట. త్వరలోనే ఈ చిత్రం యొక్క షూటింగ్ మొదలు కాబోతుంది. మరి
మురుగదాస్ లాంటి స్టార్ దర్శకుడు తో కలసి శింబు చేస్తున్న ఈ
సినిమా తప్పకుండా ఆయన కెరియర్ కు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఈ చిత్రం గురించిన అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతుంది. ఇప్పుడిప్పుడే శింబు కెరీర్ గాడిన పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు చేస్తున్న ఈ
సినిమా తప్పకుండా మంచి ప్లస్ అవుతుందనే అందరూ భావిస్తున్నారు. శింబు ఇటీవల నటించిన మానాడు
సినిమా ఎంతటి పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే. పలు కారణాల వల్ల ఆయన తన కెరియర్ను చాలా రోజులుగా కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే గాడిన పడుతూ ఆయన తన కెరియర్ను మంచిగా మలుచుకుంటున్నాడు.