టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులలో ఒకరు అయినా గోపిచంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గోపీచంద్ కొంత కాలం క్రితం విడుదల అయిన సిటిమర్ మూవీ తో మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే.

సంపత్ నంది దర్శకత్వం లో తెరకెక్కిన సిటిమర్ మూవీ తో మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న గోపీచంద్ జూలై 1 వ తేదీన విడుదల అయిన పక్కా కమర్షియల్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో గోపీచంద్ సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటించగా , మారుతిమూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేకపోయింది. దానితో చివరగా పక్కా కమర్షియల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర అపజయం పాలు అయ్యింది.  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... పక్కా కమర్షియల్ మూవీ ఆగస్ట్ 5 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టీ టీ' ప్లాట్ ఫామ్ లో ఒకటి అయిన ఆహా 'ఓ టీ టీ' ప్లాట్ ఫామ్ లో  స్ట్రీమింగ్ కానున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి థియేటర్ లలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయినా పక్కా కమర్షియల్ మూవీ 'ఓ టి టి' ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. పక్కా కమర్షియల్ మూవీ లో రావు రమేష్ ,  సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించగా , గోపీచంద్ ఈ మూవీ లో లాయర్ పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: