ఇక మరికొన్ని రోజుల తర్వాత ఆగస్టు 12వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ.. ఆరోజు చాలా సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఆగస్టు 13వ తేదీన సినిమాలు రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ లు శరవేగంగా చేపడుతున్న విషయం తెలిసింది. అంతేకాదు నిఖిల్ ఏకంగా సీరియల్స్ లోకి కూడా ప్రవేశించి.. తన సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడ్డాడు. ఇక రకరకాలుగా విభిన్న ప్రయత్నాలు చేస్తూ సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు చిత్రం యూనిట్. ఇకపోతే కార్తికేయ మొదటి సినిమాను 2014లో విడుదలై ఉత్కంఠ భరితమైన తెలుగు చిత్రం గా తెరకెక్కింది.
ఈ సినిమాలో కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించింది. ఇకపోతే సీక్వెల్లో కూడా నటిస్తుంది అని అనుకోగా.. కానీ ఎందుకో కొన్ని కారణాల చేత అనుపమ పరమేశ్వరన్ ను ఈ సినిమా సీక్వెల్లో తీసుకున్నారు. ఇప్పటికే కార్తికేయ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నిఖిల్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమాతో నైనా అనుపమ కెరియర్ మంచి సక్సెస్ బాట పడుతుందో లేదో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.