సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. నార్త్ లో సైతం
అల్లు అర్జున్ కు క్రేజ్ విపరీతంగా ఈ
సినిమా ద్వారా పెరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అందరి చూపు ఈ
సినిమా యొక్క రెండవ భాగం పైనే ఉంది. ఇంకా షూటింగ్ మొదలు పెట్టుకొని ఈ చిత్రంపై ఇప్పటినుంచి ఎన్ని అంచనాలు ఉండడం నిజంగా
అల్లు అర్జున్ కు ఏ స్థాయిలో క్రేజీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో అంశాలు ఈ సినిమాపై ఇన్ని అంచనాలు ఏర్పడడానికి ముఖ్య కారణం.
తాజాగా మారిన పరిస్థితుల రీత్యా పెరిగిన క్రేజ్ దృష్ట్యా ఈ
సినిమా కథను పూర్తిగా
మార్చి వేశారు. అంతకు ముందు దర్శకుడు
సుకుమార్ ఫిక్స్ అయిన కథను కాకుండా అన్ని వర్గాల వారికి అన్ని ప్రాంతాల వారికి నచ్చే విధంగా ఈ చిత్రం యొక్క కథను పూర్తిగా
మార్చి వేశాడు. అందుకే దీనికోసం ఇంతటి సమయాన్ని తీసుకున్నాడు. తొందర్లోనే ఈ
సినిమా యొక్క షూటింగ్ ను మొదలు పెట్టాలని భావిస్తున్న
సుకుమార్ ముందుగా సంగీతం పనులను పూర్తి చేయాలని చూస్తున్నాడు.
అందుకే ఇప్పుడు ఈ
సినిమా యొక్క సంగీతం పనులను చేస్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన ఒక ఫోటో కూడా బయటకు వచ్చింది. దానిని బట్టి ఈ
సినిమా సంగీతం యొక్క పనులను పూర్తి చేశారని చెప్పవచ్చు.
చంద్రబోస్ మరియు దేవిశ్రీప్రసాద్లతో కలిసి దర్శకుడు
సుకుమార్ ఒక ఫోటోని దిగి ఈ
సినిమా యొక్క సంగీతం పనులు షురూ అయినట్లుగా వెల్లడించారు. అయితే
సినిమా ను ఎప్పుడు మొదలుపెట్టి ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారో అన్నది చూడాలి.
రష్మిక మందన
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఈ చిత్రంలో
సమంత కూడా ఒక కీలక పాత్రలో నటించబోతుంది అని చెబుతున్నారు.