టాలీవుడ్ యువ హీరో లలో ఒకరు అయినటు వంటి సుధీర్ బాబు తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కృతి శెట్టి , సుధీర్ బాబు సరసన హీరోయిన్ గా నటించగా , ఇంద్రగంటి మోహనకృష్ణమూవీ కి దర్శకత్వం వహించాడు. ఇది వరకే సుధీర్ బాబు , ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో సమ్మోహనం , వి  మూవీ లు తెరకెక్కాయి.

అమ్మాయి గురించి మీకు చెప్పాలి  మూవీ సుధీర్ బాబు ,  ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హైట్రిక్ మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ ని సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను మూవీ యూనిట్ విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ సాటిలైట్ హక్కులకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ...  ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ సాటిలైట్ హక్కులను స్టార్ మా చానల్ వారు భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ , బెంచ్ మార్క్ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీ కి వివేక్ సాగర్ సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: