యంగ్ హీరో శర్వానంద్ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కెరియర్ పరంగా ఇంకా పూర్తిగా సెటిల్ కాలేకపోతున్నాడు. ఆమధ్య సంక్రాంతి హీరోగా ఇమేజ్ తెచ్చుకుని వరసగా రెండు సంక్రాంతులకు హిట్ కొట్టినప్పటికీ మళ్ళీ వరస పరాజయాలు అతడిని వెంటాడుతూ ఉండటంతో అతడి మార్కెట్ పూర్తిగా పడిపోయింది.


ఇలాంటి పరిస్థితుల మధ్య లో విడుదల కాబోతున్న అతడి లేటెస్ట్ మూవీ ‘ఒకే ఒక జీవితం’ అన్న టైటిల్ తో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ మూవీ కథ టైం మిషన్ కాన్సెప్ట్ తో తీయబడ్డ మూవీ. ఈ మూవీలో గతంలోకి వెళ్ళిపోయే శర్వానంద్ అతడు ఎంతగానో ప్రేమించే తన తల్లిని కలుసుకోవడం అన్న పాయింట్ చుట్టూ ఈ మూవీ కథను అల్లారు.


అక్కినేని అమల ఈ మూవీలో శర్వానంద్ కు తల్లిగా నటిస్తోంది. డిఫరెంట్ కథతో నిర్మాణం జరుపుకున్న ఈ మూవీతో మళ్ళీ తన కెరియర్ టర్న్ అవుతుందని శర్వానంద్ నమ్ముతున్నాడు. ఈమూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. తాను ఏవిషయాన్ని అయినా క్షమిస్తాను కాని మోసాన్ని తట్టుకోలేనని కామెంట్ చేసాడు.


అంతేకాదు కొందరు నిర్మాతలు తనకు పారితోషికాలు ఇవ్వకుండా మోసం చేస్సిన సందర్భాలు తనకు గతంలో ఉన్నాయి అని అంటున్నాడు. తనకు యాక్సిడెంట్ జరిగిన తరువాత రకరకాల మందులు ష్టరైడ్స్ వాడటం వలన తన ఆరోగ్యం గతంలో దెబ్బతిన్న విషయాన్ని వివరిస్తూ ఆమందుల వాడకం వలన తన శరీరం బరువు పెరిగిపోవడంతో ఆ బరువును తగ్గించుకోవడానికి చాల కష్టపడవలసి వచ్చింది అంటున్నాడు. అయితే ఇప్పుడు తాను పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నానని అంటూ తాను మంచి కథల కోసం ఎదురుచూస్తున్నాను అని అంటున్నాడు. అయితే శర్వానంద్ నటిస్తున్న ఈ లేటెస్ట్ మూవీ విజయం అతడి కెరియర్ కు అత్యంత కీలకంగా మారడంతో ఈమూవీ గురించి శర్వానంద్ బాగా టెన్షన్ పడుతున్నట్లు కనిపిస్తోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: