బుల్లితెర మీద టాప్ యాంకర్ గా కొనసాగుతోన్న యాంకర్ సుమ అందరికి తెలుసు.ఈమె  బుల్లితెర మీద అయినా వెండితెరమీద అయినా ఎక్కడైనా సరే ఏదైనా ఈవెంట్ జరిగితే ఖచ్చితంగా సుమా ఉండాల్సిందే.అయితే చిన్న సినిమాల నుంచి మొదలు పెద్ద సినిమాల వరకు జరిగే ప్రతీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కచ్చితంగా సుమ అక్కడ ఉండాల్సిందే.అంతేకాదు ఈమె తన గల గల మాటలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అయితే కేవలం బుల్లితెర మీదనే కాకుండా వెండితెర మీద కూడా జయమ్మ పంచాయతీ అనే సినిమాలో నటించి నటిగా తన అదృష్టాన్ని కూడా పరీక్షించుకుంది. సుమ భర్త రాజీవ్ కనకాల కూడా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా ఉన్నారు. ఇదిలావుంటే ఇటీవల ఈ దంపతులిద్దరూ కలిసి ఓ కొత్త ఇంటిని ఎంతో ప్రేమతో నిర్మించుకున్నారు.

ఇకపోతే వీళ్ళ ఇల్లు చాలా లగ్జరి గా ఉండడంతో పాటు సినిమా షూటింగులు కూడా ఇక్కడే జరుగుతుంటాయి.  వీళ్లు కొత్త ఇంట్లోకి అడుగు పెట్టడానికి ముందే ఈ దంపతులకు చాలా ఇబ్బందులు ఎదురైనట్లు తెలుస్తోంది. ఇక ఈ కొత్త ఇంటి నిర్మాణం 2018 లోనే పూర్తయింది. ఇక అదే సమయంలో గృహప్రవేశం చేయాలని ఈ దంపతులు అనుకున్నారట.అయితే  కానీ అదే టైమ్ లో రాజీవ్ కనకాల తల్లి అనారోగ్యంతో కన్ను మూసింది. ఇక దాంతో వాళ్ళు గృహప్రవేశ కార్యక్రమాన్ని అక్కడితో ఆపేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ 2019లో గృహ ప్రవేశం చేయాలని ఈ దంపతులు నిర్ణయించుకున్నారట.కానీ మళ్ళీ గృహ ప్రవేశం చేసే టైంలో రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల కూడా అనారోగ్యంతో చనిపోయారు.దీంతో సుమ రాజీవ్ కనకాల దంపతులు చాలా విషాదంలోకి వెళ్లిపోయారు.

ఆ తర్వాత కొన్ని రోజులకు రాజీవ్ కనకాల సోదరి క్యాన్సర్ కారణంగా మరణించింది. అయితే  ఇక ఇవన్నీ గమనించిన దంపతులు గృహప్రవేశం చేయాలి అనుకునే టైం లోనే ఏదో ఒక విషాదం మన ఇంట్లో జరుగుతుంది. మన ఇంట్లో ఏదైనా వాస్తు లోపం ఉందా అందువల్లే ఇలాంటి వరుస మరణాలు సంభవిస్తున్నాయని దంపతులిద్దరూ ఆందోళనలో పడ్డారట ఈ దంపతులిద్దరూ ఒక మంచి ముహూర్తం చూసుకుని కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. అయితే  ఇక గృహ ప్రవేశం చేసే టైం లో ఎవరో ఒకరు చనిపోతున్నారు అని వచ్చే వార్తలన్నీ సోషల్ మీడియాలో వచ్చే చెత్త రూమర్స్ అంటూ కొంత మంది వాటిని కొట్టిపారేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: