నిప్పు లేనిదే పొగరాదంటారు. ఆధారాలు లేకుండా పుకార్లు చెలరేగవు. దాదాపు రెండేళ్లుగా రష్మిక మందాన-విజయ్ దేవరకొండ మధ్య ఎఫైర్ నడుస్తుందన్న ప్రచారం బాగానే జరుగుతుంది.

ఎక్కువగా ముంబైలో ఉంటున్న వీరిద్దరూ అక్కడ జంటగా తెగ తిరుగుతున్నారు. డిన్నర్ నైట్స్ కి వెళుతూ, షాపింగ్స్ చేస్తూ పలుమార్లు ఇద్దరూ కెమెరా కంటికి  కూడా చిక్కారు. దీంతో బాలీవుడ్ మీడియా విజయ్-రష్మిక డేటింగ్ చేస్తున్నారంటూ కథనాలు రాయడం జరిగింది. ఈ వార్తలను విజయ్ దేవరకొండ  తీవ్రంగా ఖండించారు.

 అలాగే రష్మిక మేమిద్దరం మంచి స్నేహితులమంటూ రిలేషన్ ని సమర్థించుకుంది. తీరా చూస్తే.. ఇద్దరూ కలిసి మాల్దీవ్స్ వెకేషన్ కి చెక్కేస్తున్నారు. తాజాగా రష్మిక, విజయ్ దేవరకొండ ఎయిర్ పోర్ట్ లో జంటగా ప్రయాణం చేస్తూ కనిపించారు. బాలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం రష్మిక, విజయ్ మాల్దీవ్స్ వెకేషన్ కి వెళుతున్నారట. అక్కడ కొన్నాళ్లు ఏకాంతంగా గడిపి రానున్నారట. ఒకపక్క మేము స్నేహితులం మాత్రమే అంటూ ఈ రొమాంటిక్ ట్రిప్స్ ఏమిటని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు


కాగా గతంలో రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించారు. ఆయనతో రష్మికకు నిశ్చితార్థం కూడా జరిగింది. కొద్ది రోజుల్లో పెళ్లి అనగా రష్మిక హ్యాండ్ తనకి ఇచ్చింది. పెళ్లి చేసుకోనని చెప్పేసింది. కెరీర్ ముఖ్యం అంటూ రక్షిత్ శెట్టికి బ్రేకప్ చెప్పింది. గత రెండేళ్లుగా విజయ్ దేవరకొండకు సన్నిహితంగా ఉంటుంది. విజయ్ కి జంటగా గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు చేసింది రష్మిక. ఈ చిత్రాల్లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదుర్స్. లిప్ లాక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించారు.

ఇక కెరీర్ పరంగా చూస్తే రష్మిక చాలా బిజీగా ఉన్నారు. ఆమె పుష్ప 2, వారసుడు, యానిమల్, మిషన్ మజ్ను చిత్రాల్లో నటిస్తున్నారు. మిషన్ మజ్ను మినహాయిస్తే అన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. గుడ్ బై విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక విజయ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి చిత్రం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: