టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరో గా తన కంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న హీరో లలో మంచి విష్ణు ఒకరు. మంచు విష్ణు ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరో గా నటించాడు. అందులో కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా సాధించాయి. మంచు విష్ణు ఆఖరుగా మోసగాళ్లు అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ ఒక కీలకమైన పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన మోసగాళ్లు మూవీ బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేక పోయింది.

దానితో మోసగాళ్లు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.  ఇది ఇలా ఉంటే తాజాగా మంచు విష్ణు "జిన్నా" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి సూర్య దర్శకత్వం వహించగా ,  పాయల్ రాజ్ పు ,  సన్ని లియోన్ ఈ మూవీ లో మంచు విష్ణు సరసన హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ హర్రర్ కామెడీ జోనర్ లో తెరకెక్కింది. ఈ మూవీ ని అక్టోబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై పర్వాలేదు అనే రేంజ్ లో ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో మంచు విష్ణు మాట్లాడుతూ ...  నాకు రాజ్ కుమార్ హిరానీ ,  రోహిత్ శెట్టి ,  సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో నటించాలని ఉంది అని ,  కానీ వాళ్లు నాతో మూవీ తీస్తే తెలుగు ఇండస్ట్రీకి వచ్చి తెలుగు లో మాత్రమే తీయాలి ,  హిందీ సినిమా అవ్వకూడదు అని చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: