టాలీవుడ్ సినిమాలకి ప్రస్తుత కాలంలో విలన్ల కొరత చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా నటనపరంగా దర్శకులను మెప్పించచే నటులు ఇక్కడ లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా తెలుగు సినిమాలలో విలన్ అంటే బాలీవుడ్ నుంచి పట్టుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడప్పుడు కొంతమంది తెలుగు నటులు ఆస్థానాన్ని భర్తీ చేసేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్న అది ఫుల్ ఫీల్ కావడం లేదు. ఏదో రకంగా ఎక్కడో ఒకచోట అలా మిస్ అవుతూనే ఉంటుంది.


అయితే ఇటీవల ఉత్తరాదికి బదులు సౌత్ నటులను విలన్గా దింపుతున్నారు కోలీవుడ్, మాలీవుడ్ , శాండిల్ వుడ్ నటుల్ని తీసుకురావడం ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువైందని చెప్పవచ్చు. ఇక అవుట్ ఫుట్ హంగామా ఉత్తరాది నటులతో పోలిస్తే దక్షిణాది నటులు ఆయా పాత్రలకు తగ్గట్టుగా నటిస్తూ ఉంటారని చెప్పవచ్చుగా కనిపిస్తోంది. ఇలా ఇద్దరి నటల స్థానాన్ని కేవలం తెలుగు నటుడైన సత్యదేవ్ కబ్జా చేయడం ఖాయమని టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ హీరోలంతా ఇప్పుడు ఎంచుకొని ఛాయస్ గా మారిపోయారు సత్యదేవ్. ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ చిత్రంలో జై దేవ్ దాస్ పాత్రల ప్రతి ఒక్కరిని అలరించారు.


ఇక సత్యదేవ్ లో అసలైన నటనని తమిళ డైరెక్టర్ మోహన్ రాజా బయటికి తీసారని చెప్పవచ్చు. డైలాగ్ పరంగా నటన పరంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా చిరంజీవితో పోటాపోటీగా సాగిన పాత్రలో సత్యదేవ అనిపించేలా నటించారు. తెలుగులో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అనే విధంగా తన పాత్రలో ఒదిగిపోయినటించాడు సత్యదేవ్. ఇక టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారిపోతారని పలువురు మెటీరియల్ సైతం భావిస్తున్నారు. ఇక మహేష్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తదితర హీరోలకు ప్రతి నాయకుడు పాత్రలో సత్యదేవైతే కరెక్ట్ గా ఉంటారని సత్యదేవ అభిమానులు కూడా భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: