మెగాస్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన బ్రాండ్ వాల్యూ ఉందని చెప్పవచ్చు. తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హాస్యనటుడు అల్లు రామలింగయ్య గారి వారసుడుగా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన అల్లు అరవింద్ నటుడుగానే కాకుండా ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన బ్యానర్ పై ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలను తెరకెక్కించి అరుదైన ఘనతను అందుకున్నారు అల్లు అరవింద్. అయితే అల్లు అరవింద్ కు ఒక కల ఉందట ఆకల నెరవేరుతుందా లేదా అనే విషయాన్ని తెలియజేశారు వాటి గురించి తెలుసుకుందాం.


ఆలీతో సరదాగానే ప్రోగ్రాంలో మాట్లాడుతూ తన డ్రీమ్ ప్రాజెక్టుతో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో కలిసి నిర్మించబోతున్న రామాయణం గురించి తెలియజేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలో చేసింది కేవలం చిరంజీవి గారితోనేనని తెలిపారు. అంతేకాకుండా తన జీవితంలో బ్రహ్మాండమైన సినిమా తీశానన్న సంతృప్తి మగధీర సినిమా ఇచ్చిందని తెలిపారు. ఇక తనకి ఒక డ్రీమ్ ప్రాజెక్టు ఉందని వాటి గురించి బయట పెట్టారు తన బ్యానర్ల రామ్ చరణ్ అల్లు అర్జున్ కలిసి నటిస్తే బాగుంటుందని తన కోరిక అన్నట్లుగా తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టును పదేళ్ల క్రితమే చరణ్ అర్జునుని పేరు పెట్టారట ఇది ఎప్పటికైనా తెరకెక్కిస్తారని నమ్మకం ఉందని తెలిపారు.


దీన్ని బట్టి చూస్తే గడిచిన పదేళ్ల నుంచి ఈ టైటిల్ అల్లు అరవింద్ ఛాంబర్ లోనే ఉందని సమాచారం. అల్లు అర్జున్ రామ్ చరణ్ కలిసి మొదటిసారి ఎవడు చిత్రంలో నటించారు అయితే అల్లు అరవింద్ ఇద్దరితో పూర్తిస్థాయి సినిమా నిర్మించాలని ఆశపడుతున్నారట. మరి ఈ చిత్రం ఎప్పుడు నెరవేరుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అల్లు అరవింద్. అటు అల్లు అర్జున్ రామ్ చరణ్ ఇద్దరూ కూడా పాన్ ఇండియన్ హీరోగా క్రేజీ సంపాదించారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: