కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మించిన తమిళ చిత్రం 'సర్దార్'. రాశీఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్స్గా నటించిన ఈ చిత్రంలో లైలా ఓ కీ రోల్ చేశారు. ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమా తెలుగు వెర్షన్ను రిలీజ్చేస్తోంది.
ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన 'సర్దార్' ప్రీ రిలీజ్కి ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ- ''ఊపిరి' సినిమా నుంచి కార్తీతో నా అనుబంధం ప్రారంభమైంది. తను తెలుగులో మాట్లాడతాడు.. పాటలు పాడతాడు. తెలుగులో మాట్లాడినవారిని మనం హృదయాల్లో పెట్టుకుంటాం.. అందుకే కార్తీని తెలుగు ప్రేక్షకులు అంతగా ఆదరిస్తారు. అన్నపూర్ణ స్టూడియోస్ 'సర్దార్' సినిమాను సమర్పిస్తున్నందుకు చాలా గర్వంగా, హ్యాపీగా ఉంది''అన్నారు.
కార్తీ మాట్లాడుతూ- ''నాగార్జునగారు నాకు రియల్ బ్రదర్.. పెద్ద స్ఫూర్తి. సక్సెస్,ఫెయిల్యూర్స్ అనేవి ఆయన్ని ఎఫెక్ట్ చేయలేవు. సినిమాలంటే ఆయనకు ఎంతో ప్యాషన్. మంచి మనవతావాదిగా ఉంటేనే మంచి యాక్టర్గా ఉండగలమని నాగార్జునగారు ఓ సందర్భంలో చెప్పారు. నేనూ ఎప్పట్నుంచో ఫాలో అవుతున్నాను. నాగార్జునగారు యాక్ట్ చేస్తున్నారనే నేను 'ఊపిరి' సినిమా చేశాను. నా కెరీర్లో 'సర్దార్' చాలా ముఖ్యమైన సినిమా.
'సర్దార్' ఇండియన్ స్పై థ్రిల్లర్'' అన్నారు. ''నేను నటించిన 'శివపుత్రుడు' దీపావళికి రిలీజై హిట్ సాధించింది. 'సర్దార్' కూడా దీపావళికి విడుదలవుతోంది. నా బర్త్ డే కూడా ఈ
దీపావళి రోజునే (అక్టోబరు 24). చాలా ఎగై్జటింగ్గా ఉంది. ప్రతి ఒక్కరూ 'సర్దార్'సినిమాను ఎంజాయ్ చేస్తారు''అన్నారు. గేయ రచయిత రాకేందు మౌళి. అన్నపూర్ణ స్టూడియోస్ సాయిబాబా, కాస్ట్యూమ్ డిజైనర్ ప్రవీణ్ రాజా పాల్గొన్నారు.