మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది క్రికెటర్స్ వెండితెరకు పరిచయం కాగా, హీరోయిన్‌గా పరిచయం అయింది నిహారికనే. 'ఒక మనసు' చిత్రంతో కథానాయికగా పరిచయమైన నిహారిక..

హీరోయిన్‌గా కొన్ని సినిమాలు కూడా చేసింది. తెలుగుతో పాటు తమిళంలోనూ నటించింది నిహారిక. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓటీటీ రంగంలోకి కూడా అడుగు పెట్టిందట ఈ బ్యూటీ. పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉంటున్న నిహారిక.. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై వెబ్ సిరీస్‌లని నిర్మించడంపైనే దృష్టి పెట్టిందట. ఆమె గతంలో నిర్మించిన ‘ముద్దపప్పు ఆవకాయ్’, ‘నాన్నకూచి’, ‘మేడ్ హౌస్’, ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వంటి సిరీస్‌లు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

ఇటీవల ”హలో వరల్డ్” అనే మరో సరికొత్త వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించిందట.ఇక సంతోష్ శోభన్ , ఫైరియా అబ్దుల్లా జంటగా మేకర్ల గాంధీ తెరకెక్కించిన "లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్" మూవీని కూడా నిర్మించింది నిహారికనే.ఈ సినిమా నవంబర్ 4న జనం ముందుకు రాబోతుంది . ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఎప్పటినుంచో సుస్మిత నిర్మించిన శ్రీదేవి శోభన్ బాబు అనే మూవీ థియేటర్లో విడుదల చేయడానికి కొన్ని ఏళ్లు పట్టగా, నిహారిక నిర్మించిన చిత్రం ఇంత ఫాస్ట్ గా రిలీజ్ అవుతుండడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు.


నిహారిక అక్క కన్నా ఫాస్ట్ గా తన సినిమాను తెరపైకి తీసుకొస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిహారిక కొద్ది రోజుల క్రితం వ్యాపారవేత్త జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకొని ఓ ఇంటి కోడలిగా అడుగు పెట్టిందట.ఇక పెళ్లి తర్వాత మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది.సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక పోస్ట్ తో హల్ చల్ చేస్తుంది.పైగా ఫ్యాషన్ గా రెడీ అవుతూ అందర్నీ కూడా షాక్ అయ్యేలా చేస్తుంది. తన క్యూట్‌ లుక్ లతో అందర్నీ కూడా ఫిదా చేస్తుంది.ఇక తన భర్తతో దిగిన రొమాంటిక్ ఫోటోలను బాగా షేర్ చేసుకుంటూ బాగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: