మనకు తెలిసిందే సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న పరువు ప్రతిష్ట గురించి ..అలాగే మెగా ఫ్యామిలీ కి ఇంత స్టార్ డమ్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మన అందరికీ బాగా తెలిసిన విషయమే.
ఎటువంటి సపోర్ట్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి మెగా ఫ్యామిలీకి పెద్ద పునాది వేశారు. ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలో బ్రతికేస్తున్న మెగా హీరోలు ఎంతోమంది.

కాగా మెగా ఇంటి నుండి ఆడపిల్లలు కూడా సినీ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే . నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్గా ట్రై చేసి ఆ తర్వాత వర్కౌట్ అవ్వక నిర్మాణం వైపు అడుగులు వేసింది . అంతేకాదు చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా నిర్మాణరంగం వైపు అడుగులు వేసింది . మొదట తండ్రి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించిన సుస్మిత .. ప్రజెంట్ సొంత బ్యానర్ లో సినిమాలను నిర్మిస్తుంది. అయితే రీసెంట్ అందుతున్న అప్డేట్ ప్రకారం ..అక్క కన్నా చెల్లి సినిమాలు యమ ఫాస్ట్ గా నిర్మించేస్తుంది.

మనకు తెలిసిందే నాగబాబు కుమార్తె నిహారిక నిర్మాతగా మారి వెబ్ సిరీస్లను నిర్మించింది .అంతేకాదు రీసెంట్గా సంతోష్ శోభన్ , ఫైరియా అబ్దుల్లా జంటగా మేకర్ల గాంధీ తెరకెక్కించిన "లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్" మూవీని కూడా నిర్మించింది నిహారికనే. ఈ సినిమా నవంబర్ 4న జనం ముందుకు రాబోతుంది . కాగా ఎప్పటినుంచో సుస్మిత నిర్మించిన శ్రీదేవి శోభన్ బాబు అనే మూవీ థియేటర్లో విడుదల చేయడానికి కొన్ని ఏళ్లు గా వెయిట్ చేస్తుంది. అయితే ఏమాత్రం ఆలస్యం చేయని నిహారిక అక్క కన్నా ఫాస్ట్ గా తన సినిమాను తెరపైకి తీసుకొస్తుంది. దీంతో ఒక్కసారిగా నిహారిక పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు కంగ్రాట్స్ నిహారిక నిర్మాతగా హ్యూజ్ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాము అంటూ ఫ్రెండ్స్ మెగా ఫ్యాన్స్ కు ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: