తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో మెహర్ రమేష్ ఒకరు. మెహర్ రమేష్ ఇప్పటికే పలు మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడి గా తనకంటూ ఒక గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు.  మెహర్ రమేష్ ఆకరుగా విక్టరీ వెంకటేష్ హీరోగా తాప్సి హీరోయిన్ గా తెరకెక్కిన షాడో మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన షాడో మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర గోర పరాజయాన్ని అందుకుంది. షాడో మూవీ బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో మెహర్ రమేష్ చాలా రోజుల పాటు మూవీ లకు దూరంగా ఉన్నాడు.

ఇది ఇలా ఉంటే చాలా రోజుల గ్యాప్ తర్వాత మెహర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంకర్ అనే మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం అనే మూవీ కి అధికారిక రీమేక్ గా తెరకెక్కింది. భోళా శంకర్ మూవీ లో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ చెల్లెలు సెంటిమెంట్ తో తెరకెక్కుతోంది. ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలు పాత్ర లో కీర్తి సురేష్ నటిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా మెహర్ రమేష్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా మెహర్ రమేష్ భోళా శంకర్ మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశారు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా మెహర్ రమేష్ మాట్లాడుతూ ... భోళా శంకర్ మూవీ షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తి అయినట్లు మెహర్ రమేష్ తాజా ఇంటర్వ్యూ లో చెప్పు కొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే భోళా శంకర్ మూవీ నుండి కొన్ని పోస్టర్ లను మూవీ యూనిట్ విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: