బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా అందరికీ తెలుసు. ఇక ఈమె  ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.అయితే క్రికెటర్ రిషబ్ పంత్ తో ఆమె ఏదో ప్రేమ వ్యవహారం నడుపుతోంది అని అనుమానం వచ్చేలాగా పలు పోస్టులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రిషబ్ పంత్ అని అర్థం వచ్చేలా ఆర్పీ పేరుతో రకరకాల పోస్టులు పెడుతూ అటు రిషబ్ పంత్ అభిమానులకు తన అభిమానులకు కూడా నిద్ర లేకుండా చేస్తుంది.ఈమె చేస్తున్న సినిమాల కంటే వివాదాలతోనే

 ఎక్కువగా హాట్ టాపిక్ అవుతూ ఉండే ఆమె ఇప్పుడు టాలీవుడ్లో ఒక ఐటెం సాంగ్ చేసింది.ఇక  ఆ తరువాత ఈ భామకు ఇప్పుడు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు రావడం ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే బోయపాటి శ్రీను రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ సినిమాలో ఆమె ఒక ఐటెం సాంగ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇదిలావుంటే ఇప్పుడు ఆమె తెలుగులో మరో ఐటెం సాంగ్ కూడా చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.ఇకపోతే ఆ సినిమా మరేమిటో కాదు వాల్తేరు వీరయ్య అని అంటున్నారు.

అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్ లో వాల్తేరు వీరయ్య అనే సినిమా రూపొందుతోంది.ఇక  ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా ఒక ఐటెం సాంగ్ లో మెరవబోతోందని టాక్ వినిపిస్తోంది. కాగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలయ్యేందుకు రంగం సిద్ధమైంది.  అయితే జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.ఇక శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె ఒక ఐటెం సాంగ్ చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు.ఇక  మొత్తం మీద ఊర్వశి రౌతేలా ఇప్పుడు తెలుగు వారికి మోస్ట్ వాంటెడ్ ఐటమ్ గర్ల్ గా మారబోతుందని అంటున్నారు. చూడాలి ఇక  అది ఎంతవరకు నిజమవుతుంది అనేది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: