కే జి ఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యశ్ ఇప్పుడు తన తదుపరి సినిమా చేసే విధంగా రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. కన్నడలో మఫ్టీ సినిమాతో సంచలన విజయాన్ని అందుకొని దర్శకుడుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నర్తన్ అనే డైరెక్టర్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు అనే వార్తలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి అయితే ఈ సినిమా ఇంకా మొదలు కాకపోవడం యశ్ ఎప్పుడు తదుపరి సినిమా చేస్తున్నాడు అనే విధంగా ఆయన అభిమానుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.

ఈ సినిమాను ఇంకా మొదలు పెట్టకపోవడం అనేది చూస్తుంటే ఆయన  సినిమా థియేటర్లో చూడాలి అంటే మరొక రెండు సంవత్సరాలు అయినా పడుతుంది అని ఆయన అభిమానులు వాపోతున్నారు. ఆ విధంగా ఆయన సినిమాలు ఇప్పట్లో చూడకపోవడం అంటే నిజంగా వారిని ఎంతగానో నిరాశపరిచే విషయం అనే చెప్పాలి. రేపో మాపో సినిమా మొదలవుతుంది అని చెబుతున్న నర్తన్ ఈ సినిమాను కాకుండా వేరొక హీరో తో సినిమా మొదలు అవుతూ ఉండడం పట్ల వారు మరింత నిరాశనం వ్యక్తపరుస్తున్నారు. ఈ దర్శకుడు తెలుగులో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంకొక వైపు యశ్ తదుపరి సినిమాగా  కే జి ఎఫ్ మూడవ భాగం ఉంటుందని మరికొంతమంది చెబుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని  కేజీఎఫ్ రెండవ భాగం చివరిలో ఈ సినిమా యొక్క మూడవ భాగం కూడా ఉండబోతుంది అని వారు వెల్లడించారు ఈ నేపథ్యంలో ఆ మూడవ భాగం ఎప్పుడు ఉంటుందో అన్న ఆసక్తి ప్రేక్షకులు కలిగి ఉన్నారు. అయితే ప్రశాంత్ ఇతర హీరోలతో సినిమాలు చేస్తూ ఉండడంతో ఈ సినిమా ఇప్పట్లో ఉండదని కొంతమంది చెప్పారు. అయితే ఇప్పుడు డైరెక్ట్ గా ఆ సినిమా నే యశ్ చేస్తున్నాడు అని కన్నడలో వార్తలు రావడం ఏది నిజం తెలియాల్సి ఉంది. ఏదేమైనా అంతటి స్థాయిలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న యశ్ ఇంకా సినిమా చేయకుండా ఇలా ఖాళీగా ఉండడం ఆయన మార్కెట్ పట్ల ఎంతో ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: