బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్,  స్టార్ హీరో రణబీర్ కపూర్ దంపతులకు తాజాగా పండంటి బిడ్డ జన్మించిన విషయం అందరికీ తెలిసిందే.  తాజాగా ఆదివారం రోజున ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అలియా ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది . గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట ఈ ఏడాది వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.  అంతే కాకుండా పెళ్లైన రెండు నెలలకే తాను ప్రెగ్నెంట్ అంటూ అలియా భట్ కన్ఫర్మ్ చేసింది. అయితే ఎట్టకేలకు అలియా భట్ కు పాప జన్మించడంతో రణబీర్ కపూర్ ఫ్యామిలీ మొత్తం సంతోషంలో మునిగిపోయింది.  కాగా ఈ జంటకు అభిమానులతో పాటు పలువురు బాలీవుడ్ , టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇదిలా ఉండగా ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద రివ్యూలు వార్తలతో నిలిచే బాలీవుడ్ క్రిటిక్ కే ఆర్ కే అలియా భట్,  రణబీర్ కపూర్ లకు శుభాకాంక్షలు తెలిపారు. అంతవరకు బాగానే ఉంది కానీ శుభాకాంక్షలు తెలుపుతూ వివాదాస్పద రీతిలో విష్ చేయడం అందరికీ కోపాన్ని తెప్పించిందని చెప్పాలి.  అభినందనలు అంటూ సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ పై అలియా భట్ , రణబీర్ కపూర్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అంతేకాదు పలువురు కె ఆర్ కె ట్వీట్ పై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు.

మీకు కూడా కూతురు ఉంది కదా అలా ఎలా మాట్లాడుతారు అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. మరికొంతమంది ఎప్పుడూ నెగిటివ్ కామెంట్ చేయడం తప్ప మీరు పాజిటివ్ గా ఎప్పుడు ఆలోచిస్తారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే కె ఆర్ కె తనని తాను సమర్ధించుకుంటూ మీరంతా నాకు చెబుతున్నారు దేశంలో లక్షల మంది ఏడు నెలలకే పుట్టిన వారు ఉన్నారు ఇలాంటి ఫ్రీ మెచ్యూర్ బర్త్ సర్వసాధారణం అని రాసుకొచ్చాడు. మొత్తానికి అయితే ఈయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: