తాజాగా సమంత ప్రధానపాత్రలో నటించిన 'యశోద' చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో నేడు ఘనంగా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది..ఇక టీజర్ మరియు ట్రైలర్ లో చూపించినట్టుగానే సినిమా ప్రేక్షకులను థ్రిల్ కి గురి చెయ్యడం లో సక్సెస్ అయ్యింది..అయితే ఈ చిత్రానికి హరి మరియు హరీష్ అనే ఇద్దరు డైరెక్టర్స్ పని చేసారు..ఇకపోతే ఒక సినిమాకి ఇద్దరు డైరెక్టర్స్ ఉండడం చాలా అరుదుగా జరుగుతుంటుంది..అది యశోద విషయం లో జరిగింది.సమంత కి సౌత్ లో లేడీ సూపర్ స్టార్ అని పిలవబడే రేంజ్ స్టార్ స్టేటస్ ఉన్న విషయం వాస్తవమే..

ఇక ఈమె ప్రధాన పాత్రలో నటించిన 'ఓ బేబీ' అనే చిత్రం దాదాపుగా 20 కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లను రాబట్టింది..అయితే ఈమెకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండడం తో సమంత తో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తియ్యడానికి క్యూ కట్టేస్తున్నారు దర్శక నిర్మాతలు.. యశోద మూవీ ఓపెనింగ్స్ ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయాయి.ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఇటీవల విడుదలైన అన్ని సినిమాలకంటే మెరుగ్గా ఉన్నాయి.. అయితే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టి చూస్తే ఈ చిత్రానికి కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండే మొదటి రోజు రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి..

సమంత ని అందరూ ఓవర్సీస్ క్వీన్ అని ఎందుకు అంటారో 'యశోద' మూవీ ప్రీమియర్ షో కలెక్షన్స్ చూస్తే అర్థం అయిపోతుంది..అయితే ఈ సినిమా కేవలం ప్రీమియర్ షోస్ నుండి ఒక లక్ష 50 వేల డాలర్లు వసూలు చేసిందట..ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకి ఈ స్థాయి నెంబర్ రావడం చూసి చాలా కాలమే అయ్యింది.ఇదిలావుంటే ఇక సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఓ బేబీ' చిత్రం ఇక్కడ 1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.. అయితే కేవలం ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు..సమంత నటించిన సినిమాలన్నీ కూడా అమెరికా లో 1 మిలియన్ డాలర్ల క్లబ్ కి చేరినవే..ఇక ఇప్పుడు యశోద చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ రావడం తో కచ్చితంగా ఈ సినిమా కూడా 1 మిలియన్ మార్కుకి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: