బుల్లితెర పై ప్రసారం అవుతున్న షోలకు మంచి డిమాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే..బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాలతో పోటీగా శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇక ఈ కార్యక్రమంలో కూడా ఎప్పటిలాగే జబర్దస్త్ కమెడియన్స్ తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు.ఈ షో ద్వారా ఎందరో పరిచయమయ్యారు.అలాగే సినిమాల్లో మంచి చాన్స్లను కూడా అందుకొని పాపులర్ అవుతున్నారు.



అలాగే పలువురు సెలబ్రిటీలు తమ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకుల ను ఆకట్టుకుంటుంది. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.ఇక ఆదివారం ప్రసారం అయ్యే ఎపిసోడ్లో భాగంగా ముఖచిత్రం చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాల కోసం ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమం లో భాగంగా ముఖచిత్రం హీరోయిన్ తో హైపర్ ఆదితో పులిహోర కలపడానికి ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలోనే ఆమె తనని అన్నయ్య అని పిలుస్తూ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జడ్జిగా వ్యవహరిస్తున్న టువంటి ఇంద్రజ తనదైన శైలిలో మాస్ పెర్ఫార్మెన్స్ చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేశారు.



ఇంద్రజ మొదట్లో ప్రియమైన నీకు సినిమా లో మనసున ఉన్నది అనే పాటకు పర్ఫామెన్స్ చేశారు. అనంతరం గజిని సినిమా లో రహతుల రహతుల అనే పాటకు మా స్టెప్పులు వేస్తూ అద్భుతమైన పర్ఫామెన్స్ చేశారని చెప్పాలి. ఇలా ఈమె డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఓ రేంజ్ లో ప్రేక్షకుల ను ఆకట్టుకుందని చెప్పాలి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

..ఇంత వయస్సు వచ్చినా కూడా ఆమెలో గ్రేస్ మాత్రం తగ్గలేదు..ఈ విధంగా స్టెప్పులు వేయడం నిజంగా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: