తాజాగా నటసింహ బాలకృష్ణ హీరోగా 107వ సినిమా వీరసింహారెడ్డి గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న విషయం తెలిసిందే.. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి.. రిలీజ్ కి ఇంకా సరిగా నెల రోజులు సమయం ఉండడంతో పనుల్ని మరింత వేగవంతం చేస్తున్నారు చిత్ర బృందం. ఇప్పటికే పాటలు మినహా మిగతా భాగం మొత్తం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం బ్యాలెన్స్ ఒక్క పాట మాత్రమే పెండింగ్ ఉండడంతో ఆ పాట కూడా పూర్తయితే షూటింగ్ మొత్తం పూర్తయినట్లే అని సమాచారం.


మరోపక్క నిర్మాణాంతర పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.  ఇంకోవైపు సినిమా ప్రచారానికి సంబంధించిన పనులు కూడా వేగవంతం చేస్తున్నారు  నిర్మాతలు.. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అంతకంతకు అంచనాలు పెంచేస్తున్నాయి. తాజాగా వీర సింహారెడ్డి కూడా మరొకసారి బాక్సాఫీస్ వద్ద విశ్వరూపం చూపించేలాగా కనిపిస్తోంది. ఇకపోతే ఇప్పటికే వీరసింహారెడ్డి సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ పాట జై బాలయ్య చార్ట్ బస్టర్ గా నిలిచింది. రెండో సింగిల్ లిరికల్ వీడియో డిసెంబర్ 15వ తేదీన విడుదల కానుంది.

సుగుణసుందరి అనే యుగళగీతం ద్వారా మెప్పించడానికి రెడీ అవుతున్నారు శృతిహాసన్ - బాలయ్య.. సుందరమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన పాట అని తెలుస్తుంది. ముఖ్యంగా శృతిహాసన్ బాలయ్య జంట తెరపై అత్యంత ఆకట్టుకుంటుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి తాజాగా వదిలిన పోస్టర్ చూస్తే వీరిద్దరి మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ ఒక రేంజ్ లో ఉండబోతుందని అంచనా వేసుకోవచ్చు.మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  మరొకవైపు బాలయ్య తన 108వ చిత్రాన్ని కూడా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. 107వ సినిమా రిలీజ్ అయిన వెంటనే 108వ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు బాలయ్య.

మరింత సమాచారం తెలుసుకోండి: