వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రముఖ టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు సమర్పణలో మొదటిసారి కోలీవుడ్ హీరో డైరెక్ట్ గా తెలుగు, తమిళ్ లో చేస్తున్న బై లింగ్వల్ చిత్రం వారసుడు. తమిళ్లో ఈ సినిమాను వరిసు పేరిట రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.  ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ చేయడం కోసం టాలీవుడ్ నిర్మాతలతో సైతం విభేదాలు పెంచుకున్నారు దిల్ రాజు. అంతేకాదు తన థియేటర్లలో తన సినిమాను కూడా విడుదల చేయకూడదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం దిల్ రాజు అటు కోలీవుడ్ ఇటు బాలీవుడ్ లో కూడా తన ప్రొడక్షన్స్ సంస్థను విస్తరింప చేయడానికి ఇలా వరుస స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.


ఈ క్రమంలోనే మొదట వారసుడు సినిమా కథను మహేష్ బాబుకు వినిపించగా.. ఆయనకు కాల్ షీట్స్ ఇబ్బంది కారణంగా తప్పుకున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్ కు వినిపించగా రాంచరణ్ కూడా ఆర్సి15 సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంతో ఈ సినిమా చేయడానికి అంగీకరించలేదు.  దీంతో కోలీవుడ్ హీరో విజయ్ ను  సంప్రదించగా.. ఆయనకు ఈ కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీంతో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మొదటి సారి తెలుగులో నేరుగా వారసుడు సినిమాను తెరకెక్కిస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ , గ్లింప్స్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.  అంతేకాదు రూ.250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన హైయెస్ట్ చిత్రంగా సంక్రాంతి బరిలో దిగబోతోంది ఈ చిత్రం.

ఇదిలో ఉండగా జనవరి 1వ తేదీన హైదరాబాదులో ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు దిల్ రాజు.  అంతే కాదు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ ని కూడా పిలవబోతున్నారు అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి.  కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ షో కి చీఫ్ గెస్ట్ గా రావడం లేదు అన్నది క్లారిటీ.

మరింత సమాచారం తెలుసుకోండి: