ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్న ఈయన అద్భుతమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు లేడీస్ సూపర్ స్టార్ నయనతారను వివాహం చేసుకున్న తర్వాత ఈమధ్య ఈయన పేరు బాగా వినిపిస్తూ ఉండడం గమనార్హం. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై సొంతంగా సినిమాలు నిర్మిస్తూ మరింతగా దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా విగ్నేష్ శివన్ నిర్మాణ సారధ్యంలో నయనతార హీరోయిన్గా థ్రిల్లర్ హారర్ మూవీ గా రాబోతున్న చిత్రం కనెక్ట్.


సినిమా థియేటర్లలో డిసెంబర్ 22వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో థియేటర్ యాజమాన్యానికి డైరెక్టర్ విగ్నేష్ శివన్ అభ్యర్థన కోరుకున్నట్లు తెలుస్తోంది.  అసలు విషయం ఏమిటంటే డిసెంబర్ 22వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాలో థియేటర్లలో బ్రేక్ లేకుండా కొనసాగించాలి అని.. అసలు సినిమాకు బ్రేక్ ఇవ్వవద్దని ఆయన అభ్యర్థించారు.. ఎందుకంటే ముందుగానే ఈ సినిమా బ్రేక్ లెస్ మూవీ గా వస్తుందని తెలిపిన విషయం తెలిసిందే. ప్రేక్షకుల ఫీల్ ను మధ్యలో బ్రేక్ చేయడం ఇష్టం లేక వారిని మరింత భయపెట్టడానికి ఈ సినిమా బ్రేక్ లేకుండా రాబోతోందని కూడా స్పష్టం చేశారు..

అంతేకాదు మధ్యలో బ్రేక్ పెడితే సినిమా పై ఫీల్ పోతుందని అందుకోసమే బ్రేక్ కూడా ఉండకుండా కేవలం 99 నిమిషాలు నిడివి ఉన్న సినిమా మాత్రమే రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. మరి విఘ్నేష్ శివన్ అభ్యర్థన కోరిక మేరకు బ్రేక్ ఇవ్వకుండా ఉంటారా లేదా అన్నది చూడాలి. ఇక పోతే అశ్విన్ శర్వానంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అనుపమ్ ఖేర్,  సత్యరాజు తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇప్పుడు కోలీవుడ్ లో కూడా ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరి భయపెట్టడానికి సిద్ధమవుతున్న నయనతార ఎలా మెప్పిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: