ఓ జీ.. ఓ జీ.. ఓ జీ అని ఇన్నాళ్ళు గొంతు చించుకునేలా అరిచారు. ఫైనల్లీ “ఓజీ” సినిమా సక్సెస్ ఫుల్ గా రిలీజ్ అయ్యి హిట్ కొట్టేసింది. సుజిత్ ఇప్పుడు ఓజీ సినిమాతో వేరే లెవెల్ స్థానానికి చేరుకున్నారు. ఈ చిత్రం ద్వారా సుజిత్ సెన్సేషన్ సృష్టించారు. ఫలితంగా, సోషల్ మీడియాలో సుజిత్ పేరు బాగా ట్రెండ్ అవుతోంది. అంతే కాదు, సుజిత్‌తో సినిమాలో నటించడానికి, అనేక స్టార్ హీరోలు ఎదురుచూస్తున్నారు. కానీ ఆ క్రేజీ ఛాన్స్ ను నేచురల్ స్టార్ నానికు ఇచ్చారు. ఓజి  సినిమా సక్సెస్‌ పొందిన వెంటనే, సుజిత్ ముందే ననై తో మూవీ ప్రకటించారు.  అనుకున్నట్లే, దసరా కానుకగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాపై మంచి బజ్ కూడా క్రియేట్ అయ్యింది.


దీంతో సోషల్ మీడియాలో సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన ఇదే న్యూస్ బాగా వైరల్ అవుతుంది. “రెబల్ స్టార్‌తో సాహో, పవన్ కళ్యాణ్‌తో ఓజీ సినిమాలకు ఈ క్రేజీ ప్రాజెక్ట్ లింక్ పెట్టబోతున్నారా?” అనే విషయాలు ఇప్పుడు హాట్ గా ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమాకు “బ్లడీ రోమియో” అనే టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో సెన్సేషన్ న్యూస్ బయటకి వచ్చింది. ఈ సినిమా ఎవరు ఊహించాని బ్యూటీ ని సుజిత్ ఫిక్స్ చేశారు అంటూ తెలుస్తుంది. ఈ చిత్రం బ్లడీ రోమియో లో హీరోయిన్ గా సాయి పల్లవి నతీంచబోతుందట.



ఇప్పటివరకు ఏ డైరెక్టర్ కూడా చేయని రిస్కీ పని చేయబోతున్నారు సుజిత్ అంటూ తెగ పొగిడేస్తున్నారు జనాలు.  ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా ఫైనల్ అయ్యారు అంటూ ఫిలిం వర్గాలల్లో ఓ టాక్ బయటకి వచ్చింది. అందువలన నాని-సాయి పల్లవి కాంబో మళ్ళీ రిపీట్ కాబోతుందన్న ఆనందం, ఇంకోవైపు స్టార్ డైరెక్టర్ సుజిత్- సాయి పల్లవి నటనకు ఇంప్రెస్ అయ్యారని అందుకే ఇలా ఛాన్స్ ఇచ్చాడని ఫ్యాన్స్ మరింత ఉత్సాహంగా ఉన్నారు.ఒకవేళ ఇదే నిజమైతే,  ఈ సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని ముందే చెప్పేస్తున్నారు జనాలు. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఇదే విషయం హైలెట్‌గా చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి దీని పై సుజిత్ అధికారిక ప్రకటన ఎప్పుడు ఇస్తాడు అనేది..??

మరింత సమాచారం తెలుసుకోండి: