కోలీవుడ్లో స్టార్ హీరోగా ఉన్న విష్ణు విశాల్ , హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి రాజా చిత్రం మట్టి కుస్తీ. ఈ చిత్రాన్ని డైరెక్టర్ చెల్లా అయ్యావు రావు దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై, రవితేజ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. భార్య భర్తల మధ్య అనుబంధాలను అలాగే రెజ్లింగ్ నేపథ్యంలో సాగే కథ అంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు . ఈ సినిమా గత సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన తమిళ్, మలయాళం తెలుగు వంటి భాషలలో ఏకకాలంలో విడుదలైంది. జస్టిస్ ప్రభాకర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ సినిమాపై తెలుగులో ఒక మోస్తారు అంచనాలు ఏర్పడ్డాయి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్ వరకు ఓకే అనిపించింది కానీ ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

1). నైజాం-31 లక్షలు.
2). సీడెడ్ -18లక్షలు.
3). ఆంధ్రప్రదేశ్ మొత్తం కలెక్షన్ల విషయానికొస్తే.. రూ.29 లక్షలు.
4). ఆంధ్రప్రదేశ్+ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ 78లక్షలు రాబట్టింది.


మట్టి కుస్తీ సినిమా తెలుగు రాష్ట్రాలలో రూ.1.65 కోట్ల రూపాయలు థియేట్రికల్ బిజినెస్ జరగగా.. ఈ సినిమా సక్సెస్ కావాలి అంటే రూ.1.9 కోట్ల రూపాయలు  రాబట్టాల్సి ఉంది. ఈ సినిమా కేవలం రూ.78 లక్షల రూపాయలను మాత్రమే రాబట్టింది. అయితే ఆ తర్వాత హీట్ -2, లవ్ టుడే, మసూద వంటి సినిమాలు పోటీ వల్ల ఈ సినిమా నిలవలేకపోయింది. దీంతో ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ గా నిలిచిపోయింది. కానీ ఇందులో విష్ణు విశాల్ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఇక గత సినిమా ఫైర్ కూడా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మరి విష్ణు విశాల్ తన తదుపరిచిత్రంతో నైనా మంచి విజయాన్ని అందుకుంటారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: