పాటల రచయితగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న రామ జోగయ్య శాస్త్రి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన స్వస్థలం ముప్పాళ్ళ గుంటూరు జిల్లా.. 1976 ఆగస్టు 24న జన్మించిన రామ జోగయ్య శాస్త్రి గాయకుడు కావాలని ఎన్నో కలలు కనేవాడు. అయిదారు తరగతుల్లో సినిమాల ప్రభావం మొదలైంది. ఇంటర్ కి వచ్చాక ఊరికి దగ్గర్లో ఉన్న నరసరావుపేట వచ్చాడు నచ్చిన పాటలన్నీ రికార్డు చేయించుకుని.. విని నేర్చుకునేవాడు. తర్వాత ఇంజనీరింగ్ కోసం వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కళాశాలలో చేరి పూర్తీ చేసి..ఆ తర్వాత ఎం.టెక్ కోసం ఐఐటి ఖరగ్పూర్ వెళ్ళాడు.


సినీ పరిశ్రమ మద్రాస్ లో ఉండడంతో అక్కడ ఉద్యోగం దొరికితే చాలు గాయకుడు అవ్వాలన్నా తనకల సహకారం అవుతుందనుకున్నాడు.  కానీ బెంగళూరులో ఉద్యోగం వచ్చింది.  అప్పటి పరిస్థితికి ఆయనకు ఉద్యోగమే చాలా ముఖ్యమైంది.. కాబట్టి బెంగళూరు వైపు మొగ్గు చూపాడు. అక్కడ ఒక గాయకుడితో పరిచయమై అక్కడక్కడ ఆర్కెస్ట్రాలలో పాడడం మొదలుపెట్టాడు.  అక్కడ కన్నడ రచయిత శ్రీ చంద్ర,  గాయని సుజాత పరిచయమయ్యారు.. అయితే వాళ్లు ఇతనికి శాస్త్రీయ సంగీత జ్ఞానం లేదు అని చెప్పడం ఇష్టం లేక పాటల రచయితగా ప్రయత్నించమన్నారు.  అలా వాళ్ల ప్రోత్సాహంతోనే 40 క్యాసెట్ల భక్తి పాటలు రాశాడు.

సీతారామశాస్త్రి దగ్గర శిష్యరికం చేసి గీత రచయితగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.  ఇప్పటివరకు ఈయన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, ఢీ,  చిరుత,  కింగ్,  రెడీ,  ఖలేజా,  దూకుడు,  మిర్చి,  సౌఖ్యం, జనతా గ్యారేజ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాల పాటలకు లిరిక్స్ అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఇప్పుడు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో భాగం అయ్యారు.ఈయన  మీడియాతో మాట్లాడుతూ.." ఎన్టీఆర్ 30వ సినిమాకు పాటలు రాస్తున్నాను. మ్యూజిక్ సిట్టింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు.  ఈ సినిమాలో నేను ఎన్ని పాటలు రాస్తున్నానో ఇంకా శివ గారు నిర్ణయించలేదు.."  అంటూ రామ జోగయ్య శాస్త్రి వెల్లడించారు. ఈ విషయం తెలిసి అభిమానులు కూడా ఈ సినిమా పాటల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: